తొలి మెట్టు.. భవితకు ఆయువుపట్టు
పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఇటీవల రాజపేటలోని బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు సుమారు గంట పాటు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు.
పదో తరగతిలో ప్రారంభం నుంచి దృష్టి పెడితే మేలు
రాజపేట, న్యూస్టుడే
పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఇటీవల రాజపేటలోని బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు సుమారు గంట పాటు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. పదో తరగతిలో గతంలో మంచి ఫలితాలు సాధించిన వారి గురించి ఉదహరిస్తూ.. చదువుపై పిల్లలకు ఉత్తేజం కలిగించారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాధన చేసి పదో తరగతిలో 10 జీపీఏ సాధిస్తే.. అత్యుత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తి నింపే అంశాలు చెబుతూ ముఖ్యమైన విషయాంశాలపై పట్టు పెంచుకునేలా ప్రేరణ కలిగించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ముందస్తు సూచనాత్మక కథనం.
‘మేధా’ ట్రస్టు సహకారం ఇలా..
హైదరాబాద్లోని మేధా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా వందలాది మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ తత్సమాన కోర్సులో కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన నెల రోజులలోపు ట్రస్టు ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఉన్నత చదువుకు ప్రోత్సహిస్తారు. పదో తరగతిలో తొమ్మిది ఆపైన జీపీఏ కలిగి ఉండి మేధా పరీక్షలో ప్రతిభ కనబరచిన పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఇంటర్మీడియట్ నుంచి అయిదు నుంచి ఆరేళ్ల పాటు డిగ్రీ లేదా ఇంజినీరిగ్ వైద్య విద్య, లేదా విద్యార్థి ఎంచుకున్న ఏ ఇతర కోర్సులోనైనా ఉచిత వసతి కల్పిస్తున్నారు.
సర్కారు బడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా..
రాజపేటకు చెందిన జమాల్పురం విన్య స్థానికంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 9.7 జీపీఏ సాధించింది. బాసరలో ఐఐఐటీలో సీటు లభించినప్పటికీ అందులో చేరలేదు. మేధా ఛారిటబుల్ ట్రస్టు నిర్వహించిన అర్హత పరీక్షలో ప్రతిభ చూపి వారి సహకారంతో ఇంటర్, బీటెక్ కూడా పూర్తి చేస్తున్న క్రమంలోనే పీడబ్ల్యూసీ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకానికి ఎంపికైంది. ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీగా ఒప్పందం చేసుకుని గత మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తోంది. తాను పాఠశాలలో చదువుతున్నప్పుడు పదో తరగతి ప్రారంభం నుంచి శ్రద్ధతో చదవడమే కాకుండా, ప్రధానోపాధ్యాయుడు బూర్గు మహేందర్రెడ్డి, ఇతర ఉపాధ్యాయుల సూచనలు స్వీకరించి చదవడంతో రాణించినట్లు విన్య తెలిపింది.
పది జీపీఏ సాధకుడికి సీఎం సత్కారం..
రఘునాథపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో పది జీపీఏ సాధించినందుకు కొంగరి రాకేశ్కు ‘వందేమాతరం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాంతంలోని ఐటీ హబ్ లాంటి విశేష, చారిత్రక కట్టడాలు తిలకించే అవకాశం దక్కింది. అదే క్రమంలో ఇటీవల రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమావేశానికి స్వయంగా పాల్గొనడంతో పాటు శాలువా, జ్ఞాపికతో సత్కారం లభించింది. పది జీపీఏ సాధించినందుకు అరుదుగా లభించే ఈ అవకాశం అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా పాలనాధికారి హన్మంత్ కె.జెండగే చేతుల మీదుగా ప్రత్యేకంగా అభినందనలు సైతం అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలీసులకు ఏమైంది..!
[ 26-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసింగ్ దారి తప్పుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో హత్యలు, దొంగతనాలు, జాతీయ రహదారిపై దోపిడీలతో గత కొంతకాలంగా ప్రజల భద్రత గాలిలో దీపంలా మారింది. -
పల్లె వెలుగులే.. ఎక్స్ప్రెస్ బస్సులు
[ 26-06-2024]
మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ లాభాల బాట పట్టింది. గతంతో పోలిస్తే బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. -
వ్యాపారంలో రాణించాలని
[ 26-06-2024]
స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది. -
తర(గి)లిపోతున్న ముడి సరకులు
[ 26-06-2024]
నక్కలగండి ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. చేసిన పనులకు, నక్కలగండితండా వాసులకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పంపిణీకి నోచుకోకపోవడంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన నక్కలగండి బండింగ్, -
వద్దన్నా.. చల్లేస్తున్నారు
[ 26-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్రజని(యూరియా) వినియోగం ఏటేటా పెరుగుతోంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన దానికంటే రెట్టింపు స్థాయిలో వాడుతున్నారు. -
వసూళ్లకు పాల్పడుతున్న లైన్మెన్ తొలగింపు
[ 26-06-2024]
విద్యుత్తుశాఖ అనుమతులు లేకుండా పనులు చేస్తూ వినియోగదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న లైన్మెన్ పసుపులేటి శ్రీనివాస్ (జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం)ను సస్పెండ్ చేసినట్లు.. -
నగదు రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న ముఠా అరెస్టు: ఎస్పీ
[ 26-06-2024]
రూ.500 నోట్ల కట్టలో పైనా, కింద అసలు నోట్లు ఉంచి, మధ్యలో తెల్లకాగితాలు పెట్టి పలుమార్లు మోసాలకు పాల్పడుతున్న బిహార్కు చెందిన ముఠాలోని ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. -
నకిలీ బంగారం పెట్టి రూ.53.89 లక్షల రుణం
[ 26-06-2024]
నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రయిజర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. -
యాదాద్రిలో కల్యాణం- ఆకుపూజ
[ 26-06-2024]
స్వయంభూ క్షేత్రమైన యాదాద్రిలో మంగళవారం పంచనారసింహులకు నిత్యారాధనలతో పాటు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని కొలిచే ప్రత్యేక పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. -
అంతర పంటల సాగుపై అవగాహన కల్పించాలి
[ 26-06-2024]
పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. -
తనిఖీ చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా: కలెక్టర్
[ 26-06-2024]
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వైద్య అధికారులను ఆదేశించారు. -
సమన్వయంతో పనిచేద్దాం
[ 26-06-2024]
నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్
[ 26-06-2024]
జిల్లాలో ఇసుక, చెరువుల్లో మట్టి అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
హనుమాన్ ఆలయంలో పూజలు
[ 26-06-2024]
ఎన్నో పోరాటాలు చేసిన భక్తులు హనుమాన్ ఆలయం నిర్మించుకోవడమేకాకుండా.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో 18 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం..