వాన లేక.. అన్నదాత ఆందోళన
వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది.
మొలకెత్తని విత్తనాలు
న్యూస్టుడే, నార్సింగి(చేగుంట): వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులను సమకూర్చుకున్నారు. చాలా మంది వరి నార్లు పోసుకున్నారు. మరి కొందరు పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలను వేసుకున్నారు. పది రోజులుగా తేలికపాటి వానలు కూడా కురవడంలేదు.
జిల్లా వ్యాప్తంగా 37,321 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారుల అంచనా. ఇప్పటివరకు 9,500 ఎకరాల్లో మాత్రమే సాగయింది. అందులో సగం కూడా మొలకెత్తలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. రేగోడ్, అల్లాదుర్గం, చేగుంట, నిజాంపేట, టేక్మాల్ తదితర మండలాల్లో తొలకరి వర్షాలకు పత్తి సాగు చేశారు. నీటి తడి అందక అవి మొలకెత్తడంలేదు. రూ.వేల పెట్టుబడులు పెట్టినా ఇదేం పరిస్థితని వాపోతున్నారు.
బోర్ల నుంచి అందిస్తూ..: మొక్కజొన్న 2,593 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 215 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. చేగుంట, నిజాంపేట, శివ్వంపేట మండలాల్లోనే విత్తనాలు వేశారు. ఇందులో సగం మొలకెత్తలేదు. చేగుంట మండలం బోరు నుంచి నీటి తడులు అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భూగర్భజలాలు కూడా తక్కువగా ఉండడంతో సరిగా అందడంలేదు. కందులు 945 ఎకరాల్లో వేయాల్సి ఉండగా, 100 ఎకరాల్లో వేశారు. అలాగే జొన్నలు 65 ఎకరాలకు కేవలం నాలుగు ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. జూన్లో సాధారణ వర్షపాతం 64.7 మిల్లీమీటర్లకు కురిసింది 86.1 మి.మీ. ఇది కూడా మొదటి వారంలోనే కురిసింది. దీంతో రైతులు పూర్తిస్థాయిలో విత్తనాలను వేసుకోలేని పరిస్థితి నెలకొంది. విత్తనాలు వేసిన చోట మొలకెత్తడంలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగుకు ఇబ్బందులు తప్పవని రైతులు పేర్కొంటున్నారు.
తగ్గిన భూగర్భజలాలు: వర్షం కురిస్తేనే వరినాట్లు వేసుకోవడం సాధ్యపడుతుంది. ప్రసుత్తం బోర్లలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేగుంట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట, మాసాయిపేట, నార్సింగి, హవేలిఘనపూర్, నర్సాపూర్, కొల్చారం తదితర మండలాల్లో బోరు బావులనే నమ్ముకొని వరి సాగు చేస్తుంటారు. ప్రస్తుతం బోర్లలో కూడా నీటి మట్టం తగ్గింది.
తేమ ఉంటేనే విత్తనాలు వేయాలి
-గోవింద్, డీఏవో
భూమిలో తేమ ఎక్కువగా ఉంటేనే విత్తనాలు వేసుకోవాలి. భారీ వర్షాలు కురిసిన తర్వాత నీరు భూమిలోకి వెళితే తేమశాతం పెరుగుతుంది. అప్పుడు విత్తితే సమస్య ఉండదు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. అందువల్ల విత్తనాలు వేయవద్దు.
మళ్లీ దున్నాల్సిందే
-మల్లయ్య, రైతు, బోనాల
ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న వేశా. రూ.5 వేలు ఖర్చయింది. విత్తనం మొలకెత్తకపోతే మళ్లీ దున్ని వేయాలి. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. తొలకరితో విత్తనాలు నాటాం. వర్షాలు కురిస్తేనే పంటలు పండే అవకాశం ఉంది.
బోర్లలో నీటి మట్టం తగ్గింది
-మధుసూదన్రెడ్డి కర్నాల్పల్లి
బోర్లలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. వర్షం వస్తుందని ఆకాశం వంక ప్రతి రోజు చూస్తున్నాం. నీరు లేకపోతే వరి సాగు కష్టం. ఇంకా నారుమళ్లు పోయలేదు. ఎకరన్నర విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుచేశా. కొద్దిగా మొలకెత్తినా ఎండవేడికి మాడిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమాతకు ఆరోగ్య కార్డులు
[ 26-06-2024]
భూమిలో సారం బాగుంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అందులో సారం ఎంత ఉందో రైతులకు తెలియదు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
[ 26-06-2024]
ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. -
ఎంపీగా రఘునందన్రావు ప్రమాణస్వీకారం
[ 26-06-2024]
మెదక్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రఘునందన్రావు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. -
వ్యయం తగ్గి.. వెలుగులు పంచేలా
[ 26-06-2024]
విద్యుత్తు ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్ పురపాలిక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి సౌర విద్యుత్తు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
మార్గదర్శకులు రామోజీరావు
[ 26-06-2024]
పనే దైవంగా అందనంత ఎత్తుకు ఎదిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రపంచానికే మార్గదర్శకుడిగా నిలిచారని డీజీపీ ఓఎస్డీ మల్లారెడ్డి అన్నారు. -
నాటి చీకటి రోజులు మర్చిపోలేం
[ 26-06-2024]
ప్రజాస్వామ్యంలో జూన్ 25 చీకటి రోజు అని, ఎప్పటికీ మర్చిపోలేమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
అతివలకు అండగా మెప్మా
[ 26-06-2024]
మహిళా సంఘాల బలోపేతం కోసం పురపాలికలు కృషి చేస్తున్నాయి. గతేడాది అన్ని పురపాలికల్లో వంద శాతంపైగా రుణ లక్ష్యాలను సాధించాయి. -
ఉపాధికి బాసట
[ 26-06-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కని పరిస్థితి. -
మల్లన్న ఆలయ నిర్వహణ ఇష్టారాజ్యం
[ 26-06-2024]
కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్వహణలో రోజుకో వివాదం.. అక్రమం వెలుగుచూస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నాయి. -
అటవీ విద్య.. భవితకు మార్గదర్శి
[ 26-06-2024]
ఉన్నత విద్యా ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం. -
పాన్ ఉంటేనే పరిహారం
[ 26-06-2024]
చేపలు పట్టి, విక్రయిస్తూ జీవనం గడిపే మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. -
రక్షణ శూన్యం.. అదుపు తప్పితే ప్రమాదం
[ 26-06-2024]
జిల్లాలో రహదారుల వెంట పాత బావులు ప్రమాదకరంగా మారాయి. రక్షణగోడలు లేకుండా, పొదల మధ్య, మలుపుల వద్ద ఇవి ఉండడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
ఉత్తర్వులు.. ఉత్తమాటేనా!
[ 26-06-2024]
పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతోంది.. ఇక సేవలు పొందడం సులువేనని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. -
పత్తాలేని.. ప్రత్యేక సమావేశం!
[ 26-06-2024]
మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటేనే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రతినెలా ప్రత్యేకంగా ద్వితీయ సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. -
సాంకేతిక సాయం.. వెంటనే మరమ్మతు ఖాయం
[ 26-06-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం కలిగితే పూర్వాపరాలు వెంటనే తెలుసుకొని పునరుద్ధరించే వ్యవస్థను రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ముఖంపై కొట్టి.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య
-
దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్
-
వ్రజ్ ఐరన్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి సహా పూర్తి వివరాలివే..
-
అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
-
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
-
సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?