కొనుగోళ్లు ముగిశాయి.. పైసలు అందాయి..
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు.
3.15 లక్షల టన్నుల ధాన్యానికి రూ.691 కోట్ల చెల్లింపు
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యం కన్నా తక్కువ ధాన్యం కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో ధాన్యం దిగుబడులు తగ్గడం, అంచనాకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలకు రాకపోవడమే కారణమని తెలుస్తోంది.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను 210 ఐకేపీ, 6 మెప్మా, 202 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొన్నారు. గతంలో సంఘటనలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు సహా పౌరసరఫరాలు, రెవెన్యూ, ఐకేపీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. కొన్న వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు.
గతేడాది కంటే తగ్గింది
గత ఏడాది యాసంగి సీజన్తో పోల్చితే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. వానాకాలం సీజన్తో పోల్చితే మాత్రం పెరిగాయి. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. గింజకు పాలు పోసుకునే దశలో చాలా చోట్ల వరి పొలాలు ఎండిపోయాయి. దిగుబడులు పడిపోయాయి. గత ఏడాది యాసంగి సీజన్తో పోల్చితే ఈ ఏడాది 54,205 టన్నుల ధాన్యం కొనుగోలు తగ్గింది. వానాకాలం సీజన్తో పోల్చితే 6,100 టన్నులు పెరిగింది. గత ఏడాది వానకాలంలో 3.09 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు.
విక్రయించిన మూడు రోజులకే చెల్లించాం
-హరీశ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.691 కోట్లు జమ చేశాం. డబ్బుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ట్యాబ్లో నమోదు చేశారు. విక్రయించిన మూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నాం. ఇంకా సుమారు రూ.1 కోటి వరకు జమ చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే చెల్లిస్తాం. అందరి సహకారంతో కొనుగోళ్లు విజయవంతమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరి సాగు పై సందిగ్ధం
[ 27-06-2024]
వానాకాలం సీజన్లో వరి సాగు చేద్దామనుకున్న రైతులు వర్షాలు లేక మదనపడుతున్నారు. -
సాగు పెరిగేలా.. అవసరాలు తీరేలా..
[ 27-06-2024]
డిమాండ్కు అనుగుణంగా సాగు ఉండాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. -
మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం: ఎస్పీ
[ 27-06-2024]
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. -
భగీరథ సర్వేలో తాత్సారం
[ 27-06-2024]
ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. -
కస్తూర్బాలు భళా
[ 27-06-2024]
అనాథలు, నిరుపేద విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది. -
బైకులు కొల్లగొట్టి.. ఆన్లైన్లో బేరానికిపెట్టి!
[ 27-06-2024]
కారు డ్రైవరుగా పనిచేసే అతని గురంతా అత్యాధునిక బైకులపైనే.. వాటికి ఉండే డిమాండ్ దృష్ట్యా అపహరించడం.. రాష్ట్ర వ్యాప్తంగా వాటిపైనే తిరగడం.. -
చిన్నతరహా.. ఉపాధి మెరువ..
[ 27-06-2024]
యువతను ప్రోత్సహిస్తున్నాంచిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాం. -
అద్దెకు వ్యవసాయ పరికరాలు
[ 27-06-2024]
రైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్నా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలంటే అంత ధరలు భరించలేరు. -
కలల గూడు.. సాకారమయ్యేదెప్పుడు?
[ 27-06-2024]
పేద ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు తూప్రాన్ పురపాలిక కేంద్రానికి 2018లో అప్పటి ప్రభుత్వం రూ.25.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. -
ఆన్లైన్లో నిత్యావసరాల నమోదు
[ 27-06-2024]
వసతిగృహాల్లో ఉండే వస్తువులు పక్కదారి పట్టకుండా మరింత సమర్థంగా నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
-
విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!
-
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్
-
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్