Siddipet: ‘గూగుల్’లో రోడ్డుంది.. నీళ్లలోకి లారీ వెళ్లింది!
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో హిమాలయా ల్లోని దూద్కాశీకి వెళ్లడానికి చరవాణిలో గూగుల్ పటాన్ని చూస్తూ హీరో వెళ్తుంటాడు..
యువకుల సాయంతో గౌరవెల్లి ప్రాజెక్టులో తప్పిన ప్రమాదం
ప్రాజెక్టు నీటిలో చిక్కుకున్న లారీ
అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే: ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో హిమాలయాల్లోని దూద్కాశీకి వెళ్లడానికి మొబైల్లో గూగుల్ మ్యాప్ చూస్తూ హీరో వెళ్తుంటాడు.. మ్యాప్ ఆధారంగా వెళ్తే భారీ కొండ అంచుకు చేరతాడు.. కానీ అనుకున్న చోటు కనబడదు. ఇది సరదాగా తీసిన సన్నివేశమైనా సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి జలాశయం విషయంలో ‘గూగుల్’ తప్పుదారి పట్టించి, ప్రమాదంలోకి నెట్టేసింది. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలో ఓ లారీ చిక్కుకుంది. బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది.
తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్ వస్తోంది. డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యకు దారిపై సరైన అవగాహన లేదు. ఫోన్లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వస్తున్నారు. నందారం స్టేజీ దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ చూపింది. చీకట్లో లారీని నడుపుతూ అలాగే వెళ్లారు. వాన వల్ల నిలిచిన నీరు అనుకున్నారు. ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. లారీ క్యాబిన్ వరకు నీళ్లు ఉన్నాయి. కొద్దిగా లోపలికి వస్తున్నాయి. వాహనం పనిచేయడం ఆగింది. వారిద్దరూ కిందకు దిగి మెల్లగా సమీపంలోని రామవరం వచ్చారు.
గ్రామస్థులకు తెలపగా ఎంపీటీసీ సభ్యుడు లింగాల శ్రీనివాస్, గుడాటిపల్లి సర్పంచి బద్దం రాజిరెడ్డి, యువకులు వోలాద్రి మహేశ్, లింగాల చందు, రచ్చ సత్యనారాయణ వెళ్లారు. లారీకి తాళ్లు కట్టి వెనక్కు లాగడంతో అతికష్టం మీద బయటకు వచ్చింది. వాస్తవంగా నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుంచి బైపాస్రోడ్డు ద్వారా మళ్లించారు. స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా దారి పూర్తిగా మూసేయాలని స్థానికులు కోరుతున్నారు.
వాహనాన్ని బయటకు తేవడానికి సహకరించిన వారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమాతకు ఆరోగ్య కార్డులు
[ 26-06-2024]
భూమిలో సారం బాగుంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అందులో సారం ఎంత ఉందో రైతులకు తెలియదు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
[ 26-06-2024]
ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. -
ఎంపీగా రఘునందన్రావు ప్రమాణస్వీకారం
[ 26-06-2024]
మెదక్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రఘునందన్రావు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. -
వ్యయం తగ్గి.. వెలుగులు పంచేలా
[ 26-06-2024]
విద్యుత్తు ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్ పురపాలిక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి సౌర విద్యుత్తు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
మార్గదర్శకులు రామోజీరావు
[ 26-06-2024]
పనే దైవంగా అందనంత ఎత్తుకు ఎదిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రపంచానికే మార్గదర్శకుడిగా నిలిచారని డీజీపీ ఓఎస్డీ మల్లారెడ్డి అన్నారు. -
నాటి చీకటి రోజులు మర్చిపోలేం
[ 26-06-2024]
ప్రజాస్వామ్యంలో జూన్ 25 చీకటి రోజు అని, ఎప్పటికీ మర్చిపోలేమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
అతివలకు అండగా మెప్మా
[ 26-06-2024]
మహిళా సంఘాల బలోపేతం కోసం పురపాలికలు కృషి చేస్తున్నాయి. గతేడాది అన్ని పురపాలికల్లో వంద శాతంపైగా రుణ లక్ష్యాలను సాధించాయి. -
ఉపాధికి బాసట
[ 26-06-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కని పరిస్థితి. -
మల్లన్న ఆలయ నిర్వహణ ఇష్టారాజ్యం
[ 26-06-2024]
కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్వహణలో రోజుకో వివాదం.. అక్రమం వెలుగుచూస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నాయి. -
అటవీ విద్య.. భవితకు మార్గదర్శి
[ 26-06-2024]
ఉన్నత విద్యా ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం. -
పాన్ ఉంటేనే పరిహారం
[ 26-06-2024]
చేపలు పట్టి, విక్రయిస్తూ జీవనం గడిపే మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. -
రక్షణ శూన్యం.. అదుపు తప్పితే ప్రమాదం
[ 26-06-2024]
జిల్లాలో రహదారుల వెంట పాత బావులు ప్రమాదకరంగా మారాయి. రక్షణగోడలు లేకుండా, పొదల మధ్య, మలుపుల వద్ద ఇవి ఉండడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
ఉత్తర్వులు.. ఉత్తమాటేనా!
[ 26-06-2024]
పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతోంది.. ఇక సేవలు పొందడం సులువేనని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. -
పత్తాలేని.. ప్రత్యేక సమావేశం!
[ 26-06-2024]
మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటేనే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రతినెలా ప్రత్యేకంగా ద్వితీయ సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. -
సాంకేతిక సాయం.. వెంటనే మరమ్మతు ఖాయం
[ 26-06-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం కలిగితే పూర్వాపరాలు వెంటనే తెలుసుకొని పునరుద్ధరించే వ్యవస్థను రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ ఆ ఒక్క ఇన్నింగ్స్తో.. వారి నోళ్లు మూయించాడు: గిల్క్రిస్ట్
-
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మీ చిరునవ్వుతో సభలో ఆనందం: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు
-
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీ నుంచి పిలుపు
-
కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు