న్యాయం జరిగే వరకు పోరాటం : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
సంగమేశ్వరంలో బైరెడ్డితో మాట్లాడుతున్న పోలీసులు
కొత్తపల్లి, న్యూస్టుడే : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామంలో భూ సమస్యతో బీడుగా మారిన భూముల్లో మొక్కలు తొలగిస్తున్న స్థానికులకు మంగళవారం ఆయన మద్దతు తెలుపేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో సంగమేశ్వరంలో బైరెడ్డి పూజలు చేస్తుండగా ఆత్మకూరు సీఐ నాగభూషన్, కొత్తపల్లి ఎస్సై హరిప్రసాద్, పాములపాడు ఎస్సై అశోక్ వచ్చి ఆ భూముల్లో 145 సెక్షన్ అమల్లో ఉందని గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి అక్కడే విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పేదలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జానాలగూడెం, బలపాలతిప్ప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధులు విస్మరించి.. వైకాపా సేవలో తరించి
[ 26-06-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కర్నూలు నగరపాలక ఉన్నతాధికారులు నేటికీ వైకాపా నాయకుల సేవలోనే తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాల్లో పెద్దఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. -
క్రస్టుగేట్ల పనులు ప్రారంభం
[ 26-06-2024]
కొత్త ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె సంజీవయ్య సాగర్ జలాశయం ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రూ.57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పింది. ఆ తర్వాత కేవలం రూ.5 కోట్లతో గేట్ల పనులు ప్రారంభించారు. -
వైకాపా కార్యాలయాలకు తాఖీదులు
[ 26-06-2024]
కర్నూలు నగరంతోపాటు ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు. -
అనుమతులు లేకుండానే నిర్మాణాలు
[ 26-06-2024]
ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయంపై తప్పనిసరిగా చర్యలుంటాయని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి స్పష్టం చేశారు. -
కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 26-06-2024]
పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.సింహాద్రిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
అభియంత.. ఆర్అండ్బీలో నియంత
[ 26-06-2024]
వైకాపా ప్రభుత్వంలో ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్అండ్బీ శాఖలో కీలక స్థానంలో ఉన్న ఆయన జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. డోన్ నియోజకవర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. -
పురపాలకలో పెత్తందారులు
[ 26-06-2024]
ఆదోని పురపాలక సంఘంలో వైకాపా నాయకుల అక్రమాలు అన్నీఇన్ని కావు. మొన్నటి వరకు వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి. గోడకు మేకు కొట్టాలన్నా ఆ పార్టీ సానుభూతిపరులు చేయాల్సిందే. కొందరు అధికారులు నాయకులకు గులాంగిరి చేశారు. -
భూసారం.. నిస్సారం
[ 26-06-2024]
అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షల పాత్ర కీలకం. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో మట్టి నమూనాల పరీక్షలు చేసిందే లేదు. గతేడాది మట్టి నమూనాలు సేకరించినా పైసా బడ్జెట్ కేటాయించకపోవడంతో పరీక్షలు చేయలేని పరిస్థితి. -
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం
[ 26-06-2024]
శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి చెప్పారు. ఇక్కడ వసతుల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. -
అక్షర తేజం రామోజీరావు
[ 26-06-2024]
తెలుగు జాతి గర్వించే అక్షర తేజం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని ఎంపీడీవో రఘురామ్ అన్నారు. ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును స్వాగతిస్తాం
[ 26-06-2024]
వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత తెదేపా ప్రభుత్వం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఈ-పుస్తకం.. హస్తభూషణం
[ 26-06-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా.. ఉన్నత విద్య కోసం సీటు పొందాలన్నా.. పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా విజ్ఞానం చాలా అవసరం. గతంలో విజ్ఞాన పుస్తకాలు దొరకాలంటే గ్రంథాలయాలకు వెళ్తే చాలు అక్కడ వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
-
‘ఫేక్ ఇన్జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్ ఏంటంటే?
-
‘రుషికొండ’ నిర్మాణ సంస్థ సర్దేసుకుందా?
-
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..
-
అబ్దుల్ కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా: సుధామూర్తి
-
శంషాబాద్లో చిరుత సంచారం.. ఆచూకీ కోసం 20 కెమెరాలతో నిఘా