సైకిల్ సవారి.. పంకా విరిగి
సైకిల్ స్పీడుకు పంకా రెక్కలు ఊడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించింది. సైకిల్ వేగం తట్టుకోలేక వైకాపా అభ్యర్థులు బోర్లా పడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు వైకాపాను తరిమితరిమి కొట్టారు. జనం.. ఐదేళ్లపాటు వైకాపా నాయకుల ఆగడాలు భరించారు. ధరలు విపరీతంగా పెంచేసినా ఓర్పు వహించారు.
కర్నూలు, పాణ్యం, కోడుమూరులో తెదేపా అభ్యర్థుల విజయం
గౌరు చరితారెడ్డి దరహాసం , విజయచిహ్నం చూపుతున్న టీజీ భరత్
సైకిల్ స్పీడుకు పంకా రెక్కలు ఊడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించింది. సైకిల్ వేగం తట్టుకోలేక వైకాపా అభ్యర్థులు బోర్లా పడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు వైకాపాను తరిమితరిమి కొట్టారు. జనం.. ఐదేళ్లపాటు వైకాపా నాయకుల ఆగడాలు భరించారు. ధరలు విపరీతంగా పెంచేసినా ఓర్పు వహించారు. సమయం రాగానే ఓటుతో దిమ్మదిరిగే తీర్పు ఇచ్చారు.. కర్నూలు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ తన సమీప వైకాపా ప్రత్యర్థి ఏఎండీ ఇంతియాజ్పై విజయం సాధించారు. పాణ్యం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తన సమీప ప్రత్యర్థి.. వైకాపాకు చెందిన కాటసాని రాంభూపాల్రెడ్డిపై తిరుగులేని ఆధిపత్యం సాధించారు. కోడుమూరు తెదేపా అభ్యర్థిగా బరిలో దిగిన బొగ్గుల దస్తగిరి.. వైకాపాకు చెందిన సతీశ్పై గెలుపొందారు.
విజయ చరితం
పాణ్యం గడ్డపై ఎగిరిన తెదేపా జెండా
కాటసాని అక్రమాలతో విసిగిపోయిన జనం
జేసీ మౌర్య చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న గౌరు చరితారెడ్డి
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే : పాణ్యం గడ్డపై తెదేపా జెండా సగౌరవంగా ఎగిరింది. నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గౌరు చరితారెడ్డిని గెలిపించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్రెడ్డి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పారు. ప్రతి రౌండులోనూ తెదేపా అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ లభించింది.
గౌరు.. ఎమ్మెల్యేగా మూడోసారి
పాణ్యం నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అప్పట్లో కల్లూరు ప్రాంతం పాణ్యంలో లేదు. 1967 నుంచి 2004 వరకు ఐదుసార్లు కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్ ఐ, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, 1983, 1999లో తెదేపా గెలుపొందింది. 2009లో పాణ్యం నియోజకవర్గాన్ని పునర్విభజన చేశారు. కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలతోపాటు కల్లూరు వార్డులను కలిపి నియోజకవర్గంగా చేశారు. 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైకాపా గెలుపొందింది. కాటసాని రాంభూపాల్రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైకాపా తరఫున 2014లో గౌరు చరితారెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా విజయం కైవసం చేసుకున్నారు. 2004, 2014లో గౌరు చరితారెడ్డి విజయాలు నమోదు చేసుకున్నారు. 2019లో తెదేపా తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మరోసారి తెదేపా తరఫున బరిలో దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు 2004లో నందికొట్కూరు ఎమ్మెల్యేగా గౌరు చరితారెడ్డి విజయం సాధించారు.
ప్రతి గడప తొక్కి..
2019లో గౌరు చరితారెడ్డి ఓటమి పాలైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. నిరంతం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికార పార్టీ అక్రమాలపై పోరాటం చేశారు. నిత్యం గళమెత్తి ఉద్యమించారు. ఐదేళ్ల కాలంలో ప్రతి గడప తొక్కి ఓట్లు అభ్యర్థించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తెదేపా నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నారు. తెదేపా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గంలో ‘బాబు స్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు జరిపారు. ఎమ్మెల్యే కాటసాని అక్రమాలపై ఎలుగెత్తి చాటారు. వీటిని ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు.
రెపరెపలాడిన పసుపు జెండా
పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా రెపరెపలాడుతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా పనిచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు కదిలారు. పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కూటమి ఏర్పడిన నేపథ్యంలో జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలను కలుపుకొని సమన్వయంగా పనిచేస్తూ పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించారు. పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరడంతో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. ఆనందోత్సాహాలతో మునిగితేలారు.
భరత్వ్యూహం.. సఫలీకృతం
ఆర్వో భార్గవ్తేజ చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న టీజీ భరత్
కర్నూలు గాయత్రీ ఎస్టేట్, కర్నూలు సచివాలయం, న్యూస్టుడే : ఓటమిని అనుభవంగా మలుచుకోవడమేకాదు.. వ్యూహాలు రచించి విజయం అందుకోవడంలో టీజీ భరత్ సఫలీకృతులయ్యారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ తనయుడిగా.. టీజీ భరత్ అపురూపమైన విజయం అందుకున్నారు. కుటుంబ వారసత్వంగా వ్యాపారాల్లో రాణించిన టీజీ భరత్.. తన తండ్రి వారసత్వంగా సేవా కార్యక్రమాలు కొనసాగించారు. అనంతరం 2019లో రాజకీయ ప్రవేశం చేశారు. తెదేపా తరఫున కర్నూలు అసెంబ్లీ బరిలో దిగి కేవలం 5,353 ఓట్లతో ఓడిపోయారు. అయినా నిరాశకు గురికాకుండా పట్టుదలతో ఓటమికి కారణాలు విశ్లేషించుకుని వ్యూహాత్మకంగా అడుగులేశారు.
ప్రత్యేకమైన మ్యానిఫెస్టో రూపొందించుకుని..
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టోకు అనుబంధంగా తన వ్యక్తిగత ఆరు భరోసాలతో ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించారు. కర్నూలు స్మార్ట్ సిటీ, మహిళలకు స్వయం ఉపాధికి ఆర్థిక భరోసా, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, అందరికీ ఆరోగ్యం, కర్నూలుకు హైకోర్టు బెంచి ఏర్పాటు తన లక్ష్యమంటూ ప్రతి పోలింగ్ బూత్కు ముగ్గురిని నియమించుకుని ప్రతి కుటుంబానికి తన వ్యక్తిగత హామీలను వివరించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండంటూ ప్రతి ఇంటికెళ్లి అభ్యర్థించారు.
పాతబస్తీవాసుల మనసు చూరగొని..
అత్యధిక జనాభా ఉండే పాతబస్తీ ముస్లింలలో కూటమిపై ఉన్న అపోహలు తొలగించి వారి నమ్మకం పొందారు. తన గెలుపును ఆకాంక్షించే మిత్రులు, సన్నిహితులను జత చేసుకుని వైకాపా వ్యూహాలను పసిగట్టి ప్రతి వ్యూహాలు రచించారు. తన ఎన్నికల సమయంలో తన ముగ్గురు అనుచరులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన సమయంలో భరత్ తనదైన శైలిలో ప్రతిఘటించి వారికి అండగా నిలిచారు. ఐదేళ్లలో తన కోసం పనిచేసిన అనుచరులు, తెదేపా నాయకులు, కార్యకర్తలను ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టిన ప్రతి సందర్భంలో వారికి అండగా నిలిచి ధైర్యం నింపి కాపాడుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పొరపాటున కూడా వ్యక్తిగత విమర్శలు చేయకుండా అధికార పార్టీ లోపాలు ఎత్తిచూపి హుందాగా వ్యవహరించారు. ఎన్నికల రోజన ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడినా సహనం ప్రదర్శించారు. గతంలో ఎంతో మెజార్టీతో ఓడిపోయారో అంతకు నాలుగు రెట్లు మెజార్టీతో గెలుపొంది కర్నూలు అసెంబ్లీ స్థానం కైవసం చేసుకున్నారు. ప్రసుత్తం టీజీ భరత్ 20 వేలకుపైగా మెజార్టీ సాధించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గదులు కూల్చారు.. చదువుకు గండం తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
పురుగుల అన్నం తినలేకున్నాం
[ 06-07-2024]
‘అన్నంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయి. వెంట్రుకలు వస్తున్నాయి. ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. -
గదులు కూల్చారు.. భావితరానికి చిక్కులు తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
ఆక్రమణలకేసీ చూడండి
[ 06-07-2024]
రెండు లక్షల ఎకరాలకు సాగు.. వందలాది రైతు కుటుంబాల జీవనాధారమైన కేసీ కాల్వను వైకాపా నేతలు ఛిద్రం చేశారు.. కాల్వ వెంట ఉన్న ఖాళీ స్థలాలకు కబ్జా చేసి సాగునీటికి అడ్డుకట్ట వేశారు. -
విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
[ 06-07-2024]
వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన, ఎరువుల, పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
పేదింటి బిడ్డలు.. ప్రతిభలో శ్రీమంతులు
[ 06-07-2024]
వారంతా పేదింటి బిడ్డలు.. ప్రతిభలో మాత్రం శ్రీమంతులు. లక్ష్మీ కటాక్షం లేకపోవచ్చు.. సరస్వతి అనుగ్రహం మాత్రం పుష్కలం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. మరో వైపు హ్యాండ్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. -
శ్రీశైలంలో శిలపై శివలింగం గుర్తింపు
[ 06-07-2024]
శ్రీశైల మహాక్షేత్రంలోని రుద్రాక్షమఠం-సారంగధారమఠం మధ్య బండరాతి శిలపై చెక్కిన శివలింగాన్ని గుర్తించారు. అక్కడ రహదారి విస్తరణ, ప్రహరీ నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా గురువారం శివలింగం ఆకారాన్ని కనుగొన్నారు. -
మహానందిలో చిరుత సంచారం
[ 06-07-2024]
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీలో ప్రవేశానికి వేళాయె!
[ 06-07-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పటికే ప్రకటన విడుదల కాగా, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్ పద్ధతిలోనే ప్రవేశాలు జరపనున్నారు. -
భక్తి పేరుతో భూముల స్వాహా
[ 06-07-2024]
మండల పరిధిలోని కొమ్ముచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఆలయంలో ఓ వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారు. -
విజయవాడ నుంచి త్వరలో విమాన సర్వీసులు
[ 06-07-2024]
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
[ 06-07-2024]
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడినప్పుడే సంపూర్ణ అభియాన్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ రంజిత్బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్, నీతీ ఆయోగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ స్మృతి సబర్వాల్, ఆర్డీవో రామలక్ష్మి తదితరులు అన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 06-07-2024]
జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ ఒక ప్రకటనలో కోరారు. -
లా సెమిస్టర్ ఫలితాల విడుదల
[ 06-07-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్లో జరిగిన లా 3, 5వ ఏడాదికి సంబంధించి 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?