చల్లని చూపు.. ఎవరి వైపు..?
శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పార్టీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు
ఈటీవీ-ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంట్డౌన్ మొదలైంది. ఖమ్మం లోక్సభ స్థానం ఓట్లను ఖమ్మం గ్రామీణం మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. 1,896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 117 టేబుళ్లపై సాగనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై స్పష్టత రానుంది. 21 రౌండ్ల తర్వాత తుది ఫలితం వెల్లడవుతుంది. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధానంగా కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పార్టీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం సాగించారు. శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మిత్రపక్షం సీపీఐతో కలిపి హస్తం పార్టీ సుమారు 2.60 లక్షల ఓట్ల ఆధిక్యం సంపాదించింది. లోక్సభ ఎన్నికల్లోనూ అదేస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలనే లక్ష్యంతో పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రమించారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస సర్వశక్తులు ఒడ్డింది.
ఎవరి ధీమా వారిదే..
భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోరుగా ప్రచారం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గణనీయమైన ఓట్లు సాధిస్తామన్న ధీమాతో భాజపా ఉంది. పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు మద్దతుగా కేంద్ర మంత్రి అమిత్షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగన్వాడీ క్రమేణా మారుతోందండీ..
[ 06-07-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కార్యాచరణ రూపొందించింది. -
విప్లవ పార్టీల ఐక్యతా రాగం
[ 06-07-2024]
భూమి, భుక్తి, పేదల విముక్తి కోసం పోరాటాలు చేస్తున్న విప్లవ పార్టీలు కాలక్రమంలో సైద్ధాంతిక విభేదాలతో చీలిక బాట పట్టాయి. పరిణామ క్రమంలో పార్టీ మాతృరూపం పలు వర్గాలుగా విడిపోయింది. -
ఆయకట్కట..
[ 06-07-2024]
చర్ల మండలం పెద్దమిడిసిలేరు ఎత్తిపోతల పథకం ఇది. సుమారు 1,200 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.14.53 కోట్లతో నాలుగేళ్ల క్రితం పగిడివాగుపై దీన్ని నిర్మించారు -
నిర్ణయం మారదు.. తుక్కు వీడదు
[ 06-07-2024]
ఆబ్కారీశాఖ పరిధిలోని నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కేసులు, పట్టుబడుతున్న నిందితులు, వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది -
భర్త దూరమైనా.. పిల్లలే ప్రాణంగా..
[ 06-07-2024]
భర్త మృతిచెందినా తన గుండెను రాయిగా మార్చుకున్నారు. పిల్లల యోగక్షేమాలే సర్వస్వం అనుకున్నారా మాతృమూర్తి. వితంతు పింఛను, సర్కారీ ఇల్లు మంజూరు చేసి నీడ కల్పిస్తే కంటిపాపల్లా పిల్లల్ని చూసుకుంటానని అధికారులను అర్థిస్తున్నారు. -
అతి మురిపెం.. ప్రమాదకరం
[ 06-07-2024]
పెంపుడు జంతువులు, పక్షులంటే కొందరికి ప్రీతి. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు వంటి అనేక రకాల జంతువులను పెంచుకుంటుంటారు. -
కిరణ్ మృతదేహం కోసం నిరీక్షణ
[ 06-07-2024]
కల్లూరు మండలం చినకోరుకొండికి చెందిన కిరణ్కుమార్రాజు(20) అమెరికాలో ఈత కొలనులో జూన్ 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
[ 06-07-2024]
సన్ఫ్లవర్ క్రూడ్ ఆయిల్తో వెళ్తున్న ఓ ట్యాంకర్ దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఏకుల పోతమ్మతల్లి దేవాలయం సమీపంలో శుక్రవారం బోల్తా కొట్టింది -
బొగ్గు బ్లాకుల వేలం ఆపేవరకు పోరాటం
[ 06-07-2024]
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
సివిల్ సర్జన్ సస్పెన్షన్
[ 06-07-2024]
వైద్య విధాన పరిషత్ విభాగంలో సివిల్ సర్జన్ డా.బి.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్