Hyd Metro : విమానాశ్రయానికి దగ్గరి దారేది?..‘మెట్రో’ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో మెట్రో అలైన్మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆదేశించడంతో మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనానికి సన్నద్ధం అవుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో మెట్రో అలైన్మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆదేశించడంతో మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనానికి సన్నద్ధం అవుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్రెడ్డి సూచించిన రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. దూరం, నిర్మాణానికి అయ్యే వ్యయం, సేకరించాల్సిన ఆస్తుల వివరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించి సర్కారుకు అందజేయనున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
మెట్రోరైలు మొదటి దశలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ.మార్గం పూర్తయి ప్రయాణికులకు సేవలందిస్తోంది. మలిదశలో విమానాశ్రయానికి తొలుత కారిడార్-2లోని ఫలక్నుమా నుంచి కొనసాగింపుగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే కారిడార్-3 రాయదుర్గం నుంచి కొనసాగింపుగా విమానాశ్రయానికి మార్గం వేయాలని గత ప్రభుత్వం సూచించింది. టెండర్లు కూడా పూర్తయ్యాయి. 31 కి.మీ. దూరానికి రూ.6,250 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీన్ని కొత్త సర్కారు నిలిపేయమంది.
మైలార్దేవ్పల్లి నుంచి పీ7 రోడ్డు..
ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, పీ7 రోడ్ మీదుగా విమానాశ్రయానికి 13.7 కి.మీ. అవుతుందని అధికారులు అంటున్నారు. సగానికి పైగా దూరం కలిసొస్తుంది. ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట, పహాడిషరిఫ్ మీదుగా శ్రీశైలం రోడ్డు వైపు నుంచి విమానాశ్రయానికి 17 కి.మీ. దూరం అవుతుంది. నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
విమానాశ్రయ మెట్రోకి ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట 11 కి.మీ.మార్గాన్ని సైతం అనసంధానం చేయాలని కొత్త సర్కారు భావిస్తోంది. అంతకంటే ముందు నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మధ్యలో మిగిలిన 5 కి.మీ. దూరాన్ని మెట్రో మార్గంతో కలపాల్సి ఉంది.
సాధ్యాసాధ్యాల పరిశీలన..
మెట్రో ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు కూడా ప్రధానంగా చూస్తారు. దూరం, అందుకయ్యే వ్యయం, సేకరించాల్సిన ఆస్తులు, ఎక్కే ప్రయాణికుల సంఖ్య, వచ్చే ఆదాయం వంటివన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం సాధ్యమయ్యే మార్గాన్ని ఎంపిక చేయనుందని అధికారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాప్తో.. నిర్వాసితులకు భరోసా!
[ 08-07-2024]
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ నది ప్రక్షాళనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. -
ఆదేశాలు అర్థంగాక.. అన్నింటికీ రెడ్మార్క్
[ 08-07-2024]
ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఆదేశాలను రిజిస్ట్రేషన్శాఖ అధికారులు తప్పుగా అర్థం చేసుకోవడంతో హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లి గ్రామంలోని రైతులు, భూయజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వైభవంగా మహాకాళి ఆషాఢ జాతర
[ 08-07-2024]
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర ఆదివారం వైభవంగా ఆరంభమైంది. -
గ్రేటర్లో డెంగీ బెల్స్!
[ 08-07-2024]
గ్రేటర్లో డెంగీ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 900 డెంగీ కేసులు నమోదవగా...ఇందులో అధికం భాగ్యనగరంలోనివే. -
రాజ్తరుణ్తో నాది పదకొండేళ్ల ప్రేమ
[ 08-07-2024]
నటుడు రాజ్తరుణ్తో తనది 11 ఏళ్ల ప్రేమ బంధమని, సినీనటి మాల్వి మల్హోత్రా రాకతోనే తమ మధ్య దూరం ఏర్పడిందని రాజ్తరుణ్ ప్రియురాలు లావణ్య వెల్లడించారు. -
డ్రగ్స్కు వ్యతిరేకంగా బైక్పై లూథియానా నుంచి హైదరాబాద్కు
[ 08-07-2024]
డ్రగ్స్పై సమరం చేస్తూ పంజాబ్లోని లూథియానా నుంచి హైదరాబాద్కు బైక్పై వచ్చిన అలెక్స్ పి సునీల్. -
మాంసం విషయంలో దంపతుల మధ్య గొడవ
[ 08-07-2024]
మాంసం విషయంలో దంపతుల మధ్య తలెత్తిన చిన్న గొడవ భర్త ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. -
నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం.. పోలీసులకు అప్పగించిన స్థానికులు
[ 08-07-2024]
ఆమె మానసిక స్థితి సరిగా లేదని భర్త విడిచిపెట్టాడు. తీవ్ర మానసిక క్షోభకు గురై.. కొడుకుతో కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ చేరుకుంది. -
ఉత్తరాఖండ్లో మృతి చెందిన ఇద్దరికి అక్కడే అంత్యక్రియలు
[ 08-07-2024]
ఉత్తరాఖండ్లో భారీగా కురుస్తున్న వర్షాలకారణంగా కొండ చెరియలు విరిగి పడిన ఘటనలో శనివారం హైదరాబాద్కు చెందిన ధారా సత్యనారాయణ (50), నిర్మల్ సాహీ(36)లు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆలోచన సరే.. సౌకర్యాలు ఎలా?
[ 08-07-2024]
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. -
గనుల తవ్వకం.. సమకూరుతోంది ఆదాయం
[ 08-07-2024]
జిల్లాలో వాణిజ్య పట్టణంగా పేరొందింది తాండూరు. ఎక్కడా లేని విధంగా ఇక్కడే నాపరాయి, సుద్ద, సిమెంటు గనులు ఉన్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్