ప్రపంచ స్కేటింగ్లో మెరిసిన తెలుగుతేజం
ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో తెలుగు తేజం మాత్రపు జెస్సీరాజ్(13) సత్తా చాటి పసిడి పతకంతో మెరిసింది.
పసిడి పతకంతో జెస్సీరాజ్
విజయవాడ క్రీడలు, మంగళగిరి, న్యూస్టుడే : ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో తెలుగు తేజం మాత్రపు జెస్సీరాజ్(13) సత్తా చాటి పసిడి పతకంతో మెరిసింది. న్యూజిలాండ్లోని న్యూ ప్లేమౌత్లో ఈ నెల 13వ తేదీ నుంచి జరుగుతున్న పసిఫిక్ కప్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఇన్విటేషన్ పోటీల్లో జెస్సీరాజ్ భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఆదివారం జరిగిన పోటీల్లో జెస్సీరాజ్ ఇన్లైన్ ఫ్రీ స్టైల్ ఈవెంట్లో అండర్-14 బాలికల విభాగంలో తలపడి పసిడి పతకం కైవసం చేసుకుందని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి థామస్ చౌదరి తెలిపారు. ఈ ఈవెంట్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన 17 మంది క్రీడాకారిణులు తలపడగా.. జెస్సీరాజ్ అత్యధికంగా 31.98 పాయింట్లు స్కోర్ చేసి అగ్ర స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
-
విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!
-
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్
-
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్