logo

జయహో అమరావతి

ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో అమరావతి మురిసిపోయింది. రాజధానిని కాపాడుకోవడానికి కర్కశ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1631 రోజుల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసిన రైతులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు.

Published : 05 Jun 2024 06:08 IST

అంబరాన్నంటిన రాజధాని రైతుల సంబరాలు
న్యూస్‌టుడే, తుళ్లూరు

తుళ్లూరు శిబిరం వద్ద ఎల్‌ఈడీ తెరపై ఫలితాలు చూస్తున్న రాజధాని మహిళలు

ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో అమరావతి మురిసిపోయింది. రాజధానిని కాపాడుకోవడానికి కర్కశ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1631 రోజుల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసిన రైతులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. వైకాపా అరాచక పాలన అంతమైందన్న ఆనందాన్ని రైతులు, రైతుకూలీలు, మహిళలు వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజధానికి పూర్వ వైభవం తీసుకొస్తారని.. ఐదేళ్లుగా పడిన కష్టాలు గట్టెక్కి తమ ఆశలు ఫలించాయని కర్షకులు సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చారు. జయహో అమరావతి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

రంగులతో ఆనందం పంచుకుంటూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు