భూమి పత్రాలు.. వాహనాలు..
జిల్లాలో గతసారి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు.. అన్న దానిపైనే పందేలు జరిగేవి. ప్రస్తుతం తీరు పూర్తిగా భిన్నం. ఐపీఎల్లో ఒక ఓవర్ ఎన్ని ఫోర్లు, సిక్సులు కొడతారు..
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు
- ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లే వైకాపాకు వస్తాయి.. మిగిలినవన్నీ కూటమికే. ఇలా జరిగితే నాకు పాతిక.. లేకపోతే నీకు లక్ష.. ఇదీ రాజానగరం నియోజకవర్గంలోని ఓ దుకాణం వద్ద ఎన్నికల ఫలితాలపై పందెం.
- రాష్ట్రస్థాయిలో 130కి పైగా సీట్లు కూటమికే వస్తాయి.. కూటమిదే సీఎం పీఠం. కాదు జగనే సీఎం అవుతారు.. కావాలంటే రూ.లక్ష పందెం కాస్కో.. ఇదీ నగరంలోని ఓ రైతు బజారు వద్ద హడావుడి.
- మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి కచ్చితంగా 15 వేలకు పైగా మెజార్టీ వస్తుంది. కావాలంటే నా ఎకరం పొలానికి సంబంధించిన కాగితాలు పెట్టుకోండి.
- ఇదీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో పందేల తీరు. క్రికెట్ బెట్టింగులను మించి అయిదేళ్లకోసారి వచ్చే సార్వత్రిక ఫలితాలపై జిల్లాలో పందేల జోరు గట్టిగా కనిపిస్తోంది. కూలి పనులు చేసుకునే వారి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు తమ అభిమాన నాయకులు, పార్టీపైన పందేలు కడుతున్నారు. రూ.25 వేలకు తక్కువ కాకుండా రూ.లక్షల్లో పందేలపై సొమ్ములు పెడుతున్నట్లు సమాచారం. మధ్యవర్తుల వద్ద డబ్బు కలపలేని వారు భూముల కాగితాలు, వాహనాలను సైతం హామీకి పెట్టి పందేలు కడుతున్న తీరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది.
న్యూస్టుడే, కంబాలచెరువు, శ్యామలాసెంటర్ (రాజమహేంద్రవరం): జిల్లాలో గతసారి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు.. అన్న దానిపైనే పందేలు జరిగేవి. ప్రస్తుతం తీరు పూర్తిగా భిన్నం. ఐపీఎల్లో ఒక ఓవర్ ఎన్ని ఫోర్లు, సిక్సులు కొడతారు.. పవర్ ప్లేలో ఎంత స్కోరు చేస్తుంది.. అనే చిన్న పందేలు ఎక్కువగా కాస్తుంటారు. అదే విధానం ఎన్నికల ఫలితాలపై అమలు చేస్తున్నారు. సీఎం పీఠం, జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అభ్యర్థికి వచ్చే మెజార్టీలు, ఓట్ల శాతం, రౌండ్ల వారీ కూడా ఓట్లపై పందేలు కడుతున్నట్లు సమాచారం.
కోసు పందేల హవా..
ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు వరకు పందేలు సాధారణ రీతిలో జరిగాయి. ఎంత పందెం కాస్తే అంతే సొమ్ము వచ్చేలా ఉండేవి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత పందేలు మరోస్థాయికి చేరాయి. కోసు పందేల హవా మొదలైంది. పోతే రూ.50 వేలు.. వస్తే రూ.లక్ష అన్న చందంగా మారి పందేలు జరుగుతున్నాయి.
గ్రామీణ నియోజకవర్గాల్లో ఇలా..
జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, నగరం, అనపర్తి తదితర ప్రాంతాల్లో పందేల తీరు మరోస్థాయికి వెళ్లింది. పందేలు కాయడానికి డబ్బు మధ్యవర్తి దగ్గర పెట్టకుంటే పొలాల రిజిస్ట్రేషన్ పత్రాలు, ద్విచక్ర వాహనాలు, కార్లను పందేలకు హామీ పెడుతున్నారు. పందెం గెలిస్తే డబ్బు తీసుకుంటారు.. లేకుంటే డబ్బు కట్టి వాటిని విడిపించుకునేలా ముందే ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిస్థితులున్నాయి.
రూ.100 కోట్ల పైమాటే..
జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా పందేలు జరుగుతున్నట్లు అంచనా. కిళ్లీ దుకాణాల దగ్గర నుంచి హోటళ్లు, బార్లు, పొలాలు.. ఇలా అన్నీ పందేలకు వేదికలే. రూ.10 వేల దగ్గర నుంచి రూ.10 లక్షల వరకు చాలా సులభంగా మాటల్లోనే జరిగిపోతున్నాయి. ఆపై రూ.కోటి వరకు కాగితాలపై రాతలు, మధ్యవర్తుల వద్ద హామీలు పెట్టి మరీ అభిమాన నేతలపై ఆస్తులు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?