Pawan kalyan: అందరి నోట.. పవన్ మాట: జనసేనాని విజయం.. మెజార్టీపై ఆసక్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దీరారు.
పిఠాపురం, న్యూస్టుడే: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దీరారు. ఈ నేపథ్యంలో పవన్ గెలుపు ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు జూన్ ఒకటిన వెలువడిన ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉన్నాయి. అత్యధిక సర్వే సంస్థలు పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వెల్లడించాయి. మరికొన్ని సర్వేలు వైకాపా అభ్యర్థిని వంగా గీత గెలుస్తారని అంచనాలు వేశారు. పవన్ కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లలోనూ జనసేన అభ్యర్థులను బరిలో నిలిపారు. విస్తృతంగా పర్యటించి సభలు నిర్వహించారు. తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కలియదిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనేకమంది మద్దతు పలికారు. ఆయన గెలుపు ఏ విధంగా ఉంటుందనే దానిపై బెట్టింగ్లు సైతం జరుగుతున్నాయి. పవన్ గెలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో పిఠాపురానికి కూడా దేశంలో ప్రత్యేక స్థానం నెలకొంటుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్ 60వేల మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. గెలుపు, మెజార్టీ పరంగా పవన్ కల్యాణ్ విజయం కొన్నాళ్లపాటు నిలిచిపోయేలా ఉంటుందని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం ఆయన గెలుపు ఖాయమంటూ పోస్టులు పెడుతున్న తరుణంలో మంగళవారం వచ్చే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.
తాజా వార్తలు (Latest News)
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్