సైకిల్ జోరు..! ఫ్యాన్ బేజారు?
జిల్లాలోని 13,62,008 మంది ఓటర్లు సైకిల్కు మద్దతుగా నిలిచారా? ఫ్యాను పంచన చేరారా? అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మొత్తంగా ఏడు నియోజకవర్గాలకుగాను కుప్పం, పలమనేరు, నగరిలో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మూడు నియోజకవర్గాల్లో తెదేపా..
ఒకచోట మాత్రమే వైకాపా ధీమా
చిత్తూరు పార్లమెంటుపైనా గట్టి నమ్మకం పెట్టుకున్న తెలుగుదేశం
ఈనాడు, చిత్తూరు
జిల్లాలోని 13,62,008 మంది ఓటర్లు సైకిల్కు మద్దతుగా నిలిచారా? ఫ్యాను పంచన చేరారా? అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మొత్తంగా ఏడు నియోజకవర్గాలకుగాను కుప్పం, పలమనేరు, నగరిలో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క పుంగనూరును మాత్రమే వైకాపా కైవసం చేసుకుంటుందని అంటున్నారు. అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి చివరి రౌండ్ వరకు చెమటోడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం, అమాత్యుడిపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున తెలుగుదేశం సంచలన విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, వైకాపా జెండానే ఎగురుతున్న గంగాధరనెల్లూరులో ఈసారి చరిత్ర తిరగరాస్తామని తెదేపా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని భావిస్తున్నా.. సైకిల్ పార్టీనే గెలుపొందుతుందని లెక్కలు వేస్తున్నారు. చిత్తూరు లోక్సభ స్థానంలో తెదేపా అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కుప్పంలో ఆధిక్యంపైనే అందరి దృష్టి
తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. ఎనిమిదోసారీ ఆయన విజయం సాధించడం ఖాయం. 2019 ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యం వస్తుందనేది కూడా స్పష్టం. తెలుగుదేశం శ్రేణులు లక్ష ఆధిక్యం సాధించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. 40-50 వేలు ఆధిక్యం రావచ్చని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
పలమనేరులో మాజీ మంత్రి గెలుపు నల్లేరుపై నడకే
పలమనేరులో తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి అమరనాథరెడ్డికి గెలుపు నల్లేరుపై నడకే. గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి 31,616 ఓట్ల ఆధిక్యంతో అమరనాథరెడ్డిపై విజయం సాధించిన వెంకటేగౌడకు ఈసారి భంగపాటు తప్పదని ఆ పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. మైనార్టీల ఓట్లు గంపగుత్తగా ఫ్యాను గుర్తుపై పడ్డాయని సిట్టింగ్ ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇది తనకు కలిసొచ్చే అంశమని ఆయన అంటున్నారు.
పుంగనూరుపైనే ఆశలు
తక్కువ ఆధిక్యంతోనైనా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి గెలుస్తారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ ఒక్క సీటుపైనే వైకాపా నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రతిసారీ పుంగనూరు, పులిచెర్లలో అత్యధికంగా, మిగతా మండలాల్లో తక్కువ మెజార్టీ వస్తోంది. పాడి, మామిడి రైతులు మంత్రిని ఓడించాలనే కసితో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, చౌడేపల్లె ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థి చల్లా బాబుకు పట్టం కట్టవచ్చు. సదుం, పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డికి కాస్త అధికంగా ఓట్లు రావచ్చు. పోలింగ్కు ముందు రోజు పకడ్బందీగా డబ్బులు పంపిణీ చేశామని, తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఇచ్చినందున ఓటర్లు కరుణిస్తారనే విశ్వాసంతో ఉన్నారు.
జీడీ నెల్లూరులో ఫలించిన థామస్ వ్యూహం?
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కొన్ని వర్గాలు సాంప్రదాయంగా కాంగ్రెస్, వైకాపా వైపు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి థామస్కు వీరు మద్దతు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. వైకాపా నుంచి పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకూ ప్రతి అంశంలోనూ విఫలమయ్యారు. తెదేపా అభ్యర్థి థామస్ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశారు. ఈనేపథ్యంలో తెదేపా గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు.
పూతలపట్టులోనే ఉత్కంఠ
పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా ఉంది. తెదేపా అభ్యర్థి మురళీమోహన్, వైకాపా అభ్యర్థి సునీల్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. వైకాపాలోని అసమ్మతి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం తమకు లాభించే అంశాలని సైకిల్ పార్టీ నాయకుల ధీమా. ఇక్కడ రౌండ్ రౌండ్కు ఆధిక్యాలు మారినా ఆశ్చర్యం లేదు.
రోజాకు ఓటమి తప్పదా?
నగరి ఎమ్మెల్యే రోజాపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా వైకాపా అధిష్ఠానం ఆమెకే టికెట్ కేటాయించింది. దీంతో వ్యతిరేకవర్గంలోని కొందరు తెదేపా గూటికి చేరారు. మరికొందరు తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు నియోజకవర్గంలో మంత్రి సోదరులు, భర్త పెత్తనం ఎక్కువైంది. ప్రతి పనికీ డబ్బులు తీసుకున్నారనే అపఖ్యాతి మూటగట్టుకున్నారు. దీంతో ఈసారి ఓటర్లు ఆమెకు షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ.
చిత్తూరులో రసవత్తరంగా పోరు
చిత్తూరు నియోజకవర్గంలో ఈసారి తెదేపా నుంచి గురజాల జగన్మోహన్, వైకాపా నుంచి విజయానందరెడ్డి బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ కొత్త అభ్యర్థులే. ఎన్నికల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు. దీంతో పోరు రసవత్తరంగా సాగింది. చిత్తూరు గ్రామీణ, గుడిపాల మండలాల్లో తెలుగుదేశానికి, చిత్తూరు నగరంలో వైకాపాకు కొంత ఎక్కువ రావచ్చని అంచనా వేస్తున్నారు. పోలింగ్ నాడు విజయానందరెడ్డి వర్గీయులు తరచూ గొడవలకు దిగడంతో తటస్థులు తెలుగుదేశానికి ఓటు వేశారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. తక్కువ ఓట్ల తేడాతో గురజాల విజయబావుటా ఎగురవేస్తారని కూటమి నాయకులు నమ్ముతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ