ఉద్యోగుల దెబ్బకు వైకాపా విలవిల
ముందుగా ఊహించినట్లుగానే వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు కన్నెర్ర చేశారు. ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు.
అసెంబ్లీ అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడిన ఓట్ల సంఖ్య
మే మొదటి వారంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: ముందుగా ఊహించినట్లుగానే వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు కన్నెర్ర చేశారు. ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు. సరికదా... వెంటపడి వేధించిన దానికి ప్రతిఫలంగా ఓటు తీర్పుతో కోలుకోలేని దెబ్బ కొట్టారు. జిల్లాంతటా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థుల వైపే అత్యధిక శాతం మొగ్గు చూపి.. తిరుగులేని ఆధిక్యం చూపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సత్తా ఏమిటో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మరొక్కసారి నిరూపించారు. తమతో పెట్టుకుంటే కూర్చీలనే కదిలిస్తామంటూ ఓటుతో నిగ్గు తేల్చారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకే అధిక ఎక్కువ శాతం మంది ఓటు వేయడం విశేషం. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెదేపా అభ్యర్థులకు 15,058 మంది ఓటు వేయగా... సమీప ప్రత్యర్థి పార్టీ వైకాపా అభ్యర్థులకు మొత్తంగా 7,598 ఓట్లు పడటం ప్రస్తావనార్హం. అనంత నగరంలో తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్కు 4,272 మంది ఓటు వేస్తే.. వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డికి 2,038 మంది ఓటేశారు. రాప్తాడులోనూ అంతే. తెదేపా పరిటాల సునీతకు 2,406, వైకాపా ప్రకాశ్రెడ్డికి 1,273 ప్రకారం ఓట్లు పడ్డాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ తెదేపా అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వేసి అధికార వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారు.
అణచివేతకు గుణపాఠం
గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు, హక్కులు కల్పిస్తాం.. సమస్యలు తీరుస్తామంటూ వైకాపా అధినేత జగన్ ఆర్భాట హామీలతో నిండా మోసం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదేపనిగా వారిని అణచివేతకు గురి చేశారు. కనీసం నిరసన తెలియజేయడానికి వీలులేకుండా తొక్కిపెట్టారు. సస్పెన్షన్లు, తాఖీదులు, జైళ్లకు పంపడం.. వంటి వాటితో బెదిరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులపై సైతం కేసులు నమోదు చేసి భయపెట్టారు. ఐదేళ్ల కాలంలో ఒకటో తేదీ జీతం వేసిన దాఖలాలు లేవు. ఇక టీఏ, డీఏ, పీఆర్సీ, వంటి బకాయిలు ఇవ్వలేదు. డీఏలన్నీ పెండింగే. ఫిట్మెంటు విషయంలోనూ రివర్స్ గేర్ వేశారు. ఇలా అన్నింటిలోనూ ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేశారు. దీంతో వైకాపాపై కసి పెంచుకున్నారు. అవకాశం కోసం నిరీక్షించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సమయంలో తమ సత్తా ఏంటో చూపించారు. ఫలితంగా వైకాపాను చిత్తుగా ఓడించడంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారనడంలో సందేహమే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య వేధింపులతో భర్త బలవన్మరణం
[ 06-07-2024]
భార్య కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేయడంతో భర్త లోహిత్కుమార్(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పాత గుంతకల్లులో గురువారం రాత్రి జరిగింది. -
అధికారం అండతో అమిగోస్ అడ్డగోలు దోపిడీ
[ 06-07-2024]
వైకాపా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అమిగోస్ సంస్థ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. అనంతపురం జిల్లాలో గనులన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని లీజుదారులను చిత్రహింసలకు గురి చేసింది. -
ధర్మవరం టు మంగళూరు..వయా పెనుకొండ
[ 06-07-2024]
పేదల బియ్యం కొందరు పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగింది. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భూ హక్కుల్లో చిక్కులు.. రైతన్నకు తిప్పలు
[ 06-07-2024]
రాష్ట్రంలో వందేళ్ల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ, గ్రామకంఠం స్థిరాస్తుల సర్వే అంటూ గొప్పలు చెబుతూ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్షణ పథకం పేరుతో ప్రవేశపెట్టిన రీసర్వే రైతులకు పెద్దముప్పు తెచ్చిపెట్టింది. -
తరగతుల విలీనం రద్దు చేయాలని ఆందోళన
[ 06-07-2024]
హీరేహాళ్ మండలంలోని కల్యం గ్రామంలో తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు తమ పిల్లలతో కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
పత్తి తూకాల్లో మోసం
[ 06-07-2024]
మండలంలోని గౌనూరు గ్రామంలో కొంత మంది దళారులు పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడుతూ నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోయారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉండాలి
[ 06-07-2024]
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు, కార్మిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికి మేలు జరిగేలా పాలన చేయాలని, వాటి అమలు కోసం కృషి చేయాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కోరారు. -
గూగూడు ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రానివ్వద్దు
[ 06-07-2024]
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. -
బాస్కెట్బాల్లో అనంత కీర్తి
[ 06-07-2024]
బాస్కెట్బాల్ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిని అందుకుని జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా బాస్కెట్బాల్ సంఘం, ఆర్డీటీ ప్రోత్సాహంతో అనంతపురానికి చెందిన ద్వారకానాథరెడ్డి అత్యున్నత శిఖరాలు అందుకున్నాడు. -
గనుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు
[ 06-07-2024]
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతంలో ఉన్న ఏడు బీ-1 గనుల లీజుదారుల నుంచి కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) విజ్ఞప్తులను స్వీకరించింది. -
అంగన్వాడీ ఖాళీ పోస్టులను తేల్చండి: పీడీ
[ 06-07-2024]
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్యను తేల్చాలని ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పదకొండు ప్రాజెక్టుల సీడీపీఓలతో సమీక్ష జరిపారు. -
సెక్టోరియల్.. అడ్డదారుల్!
[ 06-07-2024]
సమగ్రశిక్షా పథకం కార్యాలయంలో కొందరు అడ్డదారిలో పదవులు చేజిక్కించుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు, విద్యాశాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పదవులు చేపట్టారు.