జనం గుండెల్లో కొలువై...
పదవి వ్యక్తికి అలంకారం కారాదు. వ్యక్తి తన ప్రవర్తనతో అపదవికే వన్నె తేవాలి’ అన్న మాటను నూరుశాతం ఆచరణలో పెట్టారు ఆయన. సజీవంగా లేకపోయినా జనం గుండెల్లో జీవించే ఉన్నారు విల్లూరి వెంకట రమణ.
నేడు వీవీ రమణ శత జయంతి ఉత్సవాలు
ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు రాక
గవరపాలెంలో ఏర్పాటు చేసిన వీవీ రమణ విగ్రహం
అనకాపల్లి, న్యూస్టుడే : ‘పదవి వ్యక్తికి అలంకారం కారాదు. వ్యక్తి తన ప్రవర్తనతో అపదవికే వన్నె తేవాలి’ అన్న మాటను నూరుశాతం ఆచరణలో పెట్టారు ఆయన. సజీవంగా లేకపోయినా జనం గుండెల్లో జీవించే ఉన్నారు విల్లూరి వెంకట రమణ. ఆయనకు రైతులు గుడి కట్టి మరీ గుండెల్లో పెట్టుకున్నారు. శతజయంతి ఉత్సవాలను ఆదివారం పట్టణంలో అనకాపల్లి వ్యవసాయదార్ల సంఘం, వీవీ రమణ ట్రస్టు భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సాయంత్రం నిర్వహించే సభలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు పలువురు పాల్గొంటున్నారు.
రైతు సమస్యలపై వీవీ రమణ చూపే చొరవే రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యేలా చేసింది. కేవలం 31 ఏళ్లకే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ జగ్జీవన్రామ్, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి ఎందరో నేతలతో పనిచేసిన అనుభవం ఆయనది. ఎన్జీ రంగా, గౌతు లచ్చన్నలకు ప్రియ శిష్యునిగా వ్యవహరించారు. అప్పట్లో కాంగ్రెసు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. రైతుల కోసం తన సొంత డబ్బునే ఖర్చు చేసేవారు. కృషికార్లోక్, స్వతంత్ర పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు. దేశంలోనే తొలిసారిగా రైతులతో కలిసి ప్రత్యేకంగా రైలు యాత్ర నిర్వహించారు. దిల్లీలో రాష్ట్రపతితో రైతులతో మాట్లాడించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని అప్పటి యాజమాన్యం అమ్మకానికి పెడితే రైతుల నుంచి రూ.27 లక్షలు వసూలు చేసి కొనుగోలు చేసి సహకార రంగంలో నడిపారు. అందుకే ఆ కర్మాగారానికి ఆయన పేరే పెట్టారు. పట్టణంలోని గౌరీ ప్రాథమిక సహకార సంఘానికి, అనకాపల్లి వ్యవసాయదారుల సంఘానికి ఆయన పేరు పెట్టి తమకున్న గౌరవాన్ని రైతులు చాటుకున్నారు. గవరపాలెంలో ప్రత్యేకంగా గుడికట్టి పూజలు చేస్తారు. సంక్రాంతికి ప్రత్యేకంగా జాతర నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడుగుకో గుంత.. ఎప్పుడు తీరెనో చింత...
[ 07-07-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రహదారులను కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు. -
సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం
[ 07-07-2024]
నుర్మతి పంచాయతీ సిరసపల్లి, జీరుగులగొయ్యి గ్రామాలకు సీఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం కల్పించారు -
మావోయిస్టు, సానుభూతిపరుల అరెస్టు
[ 07-07-2024]
ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు -
అంబులెన్సులో ప్రసవం
[ 07-07-2024]
అంబులెన్సులో గిరి మహిళ ప్రసవమైంది. కోటగున్నల గ్రామానికి చెందిన కిల్లో చిన్ని నిండు గర్భిణి. శనివారం ఈమెకు నొప్పులు అధికమవ్వడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. -
చెరువు భూమిలో కంచె
[ 07-07-2024]
ఉపాధ్యాయుడి పూర్వీకులు 70 ఏళ్ల క్రితమే వాటిని గ్రామంలోని చెరువు, ఇతర అవసరాలకు ఇచ్చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాటికి పట్టాలు ఇవ్వడంతో ఉపాధ్యాయుడు చెరువు, చెక్డ్యాం తమదేనని దాని చుట్టూ కంచె వేయించి, దానిలో మొక్కలు వేశారు -
ఊరికి ఉపకారం
[ 07-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారిలో గోతులు పడి, వర్షాల కారణంగా బురదమయమైంది. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దానిని బాగు చేయాలనుకుని ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు -
మూడు మండలాల్లో సంపూర్ణత అభియాన్
[ 07-07-2024]
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ, వివాదాలకు తావులేకుండా పాలన సాగిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్పారు. -
15 రోజుల్లో విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం
[ 07-07-2024]
మండలంలోని రొంపల్లి పంచాయతీ బురుగు, చినకోనెల గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు లైన్లు వేస్తున్నామని ఈపీడీసీఎల్ ఈఈ ఏవీఎన్ఎం అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.