చారిత్రక కోట.. బోథ్ అడ్డా!
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్ చేశారు.
న్యూస్టుడే, ఇచ్చోడ : బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్ చేశారు. నియోజకవర్గంలో బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, సిరికొండ, భీంపూర్ మండలాలు ఉన్నాయి. ఇటీవల సొనాలను నూతన మండలంగా ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు మండలాలను బోథ్లో కలిపారు. అంతకు ముందు బోథ్ నియోజకవర్గంలో నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలు ఉండగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నార్నూర్ను, ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండలాన్ని కలిపారు. నియోజకవర్గంలో గిరిజనులకు రిజర్వ్డ్ అయినా గిరిజనేతర ఓట్లే ఇక్కడ కీలకం.
బోథ్ నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారం. ఇక్కడ జలవనరులు ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణం లేక రైతులు వర్షాధారిత పంటలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న తరహా ప్రాజెక్టులు తాంసి మండలం మత్తడివాగు, సిరికొండ మండలం చిక్మాన్ ప్రాజెక్ట్, బోథ్ మండలం కరత్వాడ ప్రాజెక్ట్లే దిక్కు. నేరడిగొండలో కుప్టి వంతెన నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెప్పినా ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. పత్తి, సోయా, టమాట పంటలు సాగు చేస్తారు.
నాటి ఆనవాళ్లు..
బోథ్ నియోజకవర్గంలో చారిత్రక ఆనవాళ్లకు కొదువలేదు. కాకతీయులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇచ్చోడ మండలం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం, నేరడిగొండ మండలం వడూర్, ఇచ్చోడ మండలం కామగిరిలో ఇక్ష్వాకుల కాలం నాటి శిలాశాసనాలు, గుడిహత్నూర్ మండలం రామాలయం, బజార్హత్నూర్ మండలం కనకాయి, నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో సోమేశ్వర స్వామి, సిరికొండ, సొనాల, దర్బా గ్రామాలు ప్రాచీన చరిత్రకు నిలయాలు.
పర్యాటక ప్రదేశాలు
బోథ్ నియోజకవర్గం పర్యాటక కేంద్రాలకు నెలవు. రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కుంటాల ఈ నియోజకవర్గంలోనే ఉంది. బోథ్ మండలం పొచ్చెర, ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతాలు ఆకట్టుకుంటాయి.
పరిశ్రమల జాడ లేదు
ఇప్పటి వరకు పరిశ్రమల స్థాపన జరగలేదు. పత్తి, సోయాతో పాటు టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో టమాట జ్యూస్ పరిశ్రమ ఏర్పాటుకు హామీ ఇచ్చిన నేటికీ నెరవేరలేదు. నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
ఆ మూడు పార్టీలే
- ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్, తెదేపా, తెరాస పార్టీ గెలుపొందాయి. 1962లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాధవరెడ్డి గెలుపొందారు. 1967, 1972, 1978, 1983లో వరుసగా హస్తం పార్టీ పాగా వేసింది.
- 1985లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గోడం రామారావు తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989లోనూ ఆయనే విజయం సాధించారు. 1994లో ఆయన తనయుడు నగేశ్ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి రాగా, తెదేపా నుంచి గెలుపొందారు. 1999లోనూ విజయం సాధించారు.
- ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సోయం బాపురావు 2004లో తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
- 2009లో గోడం నగేశ్ తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందారు.
- ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెరాస నుంచి పోటీ చేసిన రాఠోడ్ బాపురావు 2014, 2018లో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీ పాలక వర్గానికి సన్మానం
[ 05-07-2024]
జిల్లా పరిషత్ పాలక వర్గ సభ్యుల పదవీ కాలం ముగియడంతో శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
రిటైనింగ్ రూములు ప్రారంభం
[ 05-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రిటైనింగ్ రూములను దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎన్.సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. -
వామపక్షాల ధర్నా
[ 05-07-2024]
సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేట్టారు. -
డెంగీ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ
[ 05-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. -
ఇక ఉద్యోగుల బదిలీల సందడి
[ 05-07-2024]
జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియంతా కలెక్టరేట్ వేదికగా జరగనున్నాయి. పాలనాధికారి ఛైర్మన్గా, ఆయా శాఖల అధిపతులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. -
అడుగుకో గుంత.. ప్రాణాలకు లేదు భరోసా!
[ 05-07-2024]
రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు. -
ప్రొటోకాల్ రగడ.. నేతల గడబిడ
[ 05-07-2024]
‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతున్నారని, పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్ (నియోజకవర్గ ఇన్ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
గుట్కాపై ఉక్కుపాదం!
[ 05-07-2024]
నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. -
కోటాను కోట్లు.. నీరందక పాట్లు
[ 05-07-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. -
సరిహద్దు వివాదం.. ప్రగతికి ఆటంకం
[ 05-07-2024]
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు. -
చీకట్లో బాధితులు.. రెండు గంటలు అవస్థలు
[ 05-07-2024]
మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం గందరగోళాన్ని సృష్టించింది. -
అతిక్రమిస్తే.. తప్పదు మూల్యం
[ 05-07-2024]
మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. -
ఏడు సవాళ్లు.. అధిగమిస్తేనే అవకాశాలు
[ 05-07-2024]
క్రీడలను కెరీర్గా మల్చుకోవాలనుకుంటున్న విద్యార్థులను తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట క్రీడా పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయి. -
‘భోజనం’.. జర పైలం!
[ 05-07-2024]
ఇంట్లో ఒకరిద్దరికి వంట చేయడం సులువే. వంట గదిని శుభ్రంగా ఉంచడం ఇబ్బందేమీ కాదు. కానీ వందల మందికి వంట చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. -
ఖరీదైన వైద్యం.. అందితేనే వ్యాధి నయం
[ 05-07-2024]
తమ ఇంట తొలి సంతానంగా కొడుకు జన్మించినందుకు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. -
బస్సులో గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
[ 05-07-2024]
నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులో నిందితుడి కోసం వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వస్తున్న సీఐడీ ఏఎస్ఐ సెట్విన్ బస్సులో గుండెపోటుతో మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
-
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
-
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
-
నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు