భిన్నత్వంలో ఏకత్వం.. ఆదిలాబాద్ ప్రత్యేకం
గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్లో కనిపిస్తాయి.
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్లో కనిపిస్తాయి. బిహార్, అసోం, ఒడిశా రాష్ట్రాలవాసులు ఇక్కడి వారితో కలిసిపోయి పని చేసుకుంటారు. మొత్తానికి మినీ భారత్గా ఆదిలాబాద్ ప్రసిద్ధికెక్కింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. నియోజకవర్గం ఆదిలాబాద్, బేల, జైనథ్, మావల మండలాలు, ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంతో కలిసి ఉంటుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందాక ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. తొలుత జైనథ్, బేల, ఆదిలాబాద్ గ్రామీణం, తలమడుగు, తాంసి తదితర అయిదు మండలాలు, ఆదిలాబాద్ మున్సిపాల్టీతో ఏర్పడిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా కొన్ని మండలాలను కుదించారు. తలమడుగు, తాంసి మండలాలను బోథ్ నియోజకవర్గంలో కలపడంతో 2009లో మూడు మండలాలు, ఒక పట్టణంతో నియోజకవర్గ స్వరూపం మారింది. తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలతో మావల మండలం కొత్తగా రూపుదిద్దుకుంది. తాజాగా సాత్నాల, భోరజ్ల పేరుతో మరో రెండు మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారీగా సున్నపురాయి నిక్షేపాలు
ఇక్కడ సున్నపురాయి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రం 1982లో ఆదిలాబాద్లో సుమారు 2 వేల ఎకరాలను లీజుకు తీసుకొని సిమెంటు పరిశ్రమను స్థాపించింది. ఈ పరిశ్రమ 1998లో మూతపడింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయి సమీపంలో ప్రైవేటు సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు సైతం సున్నపురాయి నిల్వలు ఉన్న భూములను గుర్తించారు. ఆదిలాబాద్ మండలం జందాపూర్ ప్రాంతంలో మాంగనీసు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ కంపెనీలు రైతుల భూములను లీజుకు తీసుకొని మాంగనీసును ఇతర రాష్ట్రాలకు తరలించగా ప్రస్తుతానికి దేశంలో డిమాండ్ తగ్గడంతో ఈ వ్యాపారం తగ్గుముఖం పట్టింది.
ప్రాచీన ఆలయాలు
జైనథ్ మండల కేంద్రంలో 1200 ఏళ్ల కిందట జైనులు నిర్మించినట్లు చెబుతున్న శ్రీ లక్ష్మీనారాయస్వామి ఆలయం ఉంది. బేల మండలంలో సదల్పూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆదివాసీల ఆరాధ్య దైవం భైరాందేవ్, మహాదేవ్ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.
తెల్ల బంగారంలో నెంబరు 1
ఆదిలాబాద్ చుట్టు పక్కల గ్రామాల్లో పండించిన పత్తిపంటకు ఆసియా ఖండంలో మంచి పేరుంది. వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పత్తి తర్వాత అధికంగా సోయాను పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్గంగా నీటిని ఒడిసిపట్టేందుకు రూ.1500 కోట్ల వ్యయంతో చనాఖా-కోర్ట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇటీవలే ట్రయల్ రన్ ప్రారంభించి జైనథ్, బేల మండలాల్లోని గ్రామాలకు నిర్మించిన కాలువలోకి నీళ్లు వదిలారు. ఇది పూర్తిగా వినియోగంలోకి రాలేదు.
తొలినాళ్లలో ఎర్రజెండాకు పట్టం
రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులపై నిషేధం ఉండటంతో తొలినాళ్లలో పీడీఎఫ్ గుర్తుమీద పోటీ చేశారు. వరుసగా రెండుమార్లు ప్రజలు వారికి పట్టం కట్టారు. నిషేధం ఎత్తివేశాక ఒకసారి సీపీఐని గెలిపించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా అందులో ఒకసారి మాత్రమే ఉప ఎన్నికలు వచ్చాయి. 2009లో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న 2012లో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు. స్వతంత్రులకు నాలుగు మార్లు పట్టం కట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీ పాలక వర్గానికి సన్మానం
[ 05-07-2024]
జిల్లా పరిషత్ పాలక వర్గ సభ్యుల పదవీ కాలం ముగియడంతో శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
రిటైనింగ్ రూములు ప్రారంభం
[ 05-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రిటైనింగ్ రూములను దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎన్.సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. -
వామపక్షాల ధర్నా
[ 05-07-2024]
సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేట్టారు. -
డెంగీ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ
[ 05-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. -
ఇక ఉద్యోగుల బదిలీల సందడి
[ 05-07-2024]
జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియంతా కలెక్టరేట్ వేదికగా జరగనున్నాయి. పాలనాధికారి ఛైర్మన్గా, ఆయా శాఖల అధిపతులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. -
అడుగుకో గుంత.. ప్రాణాలకు లేదు భరోసా!
[ 05-07-2024]
రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు. -
ప్రొటోకాల్ రగడ.. నేతల గడబిడ
[ 05-07-2024]
‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతున్నారని, పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్ (నియోజకవర్గ ఇన్ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
గుట్కాపై ఉక్కుపాదం!
[ 05-07-2024]
నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. -
కోటాను కోట్లు.. నీరందక పాట్లు
[ 05-07-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. -
సరిహద్దు వివాదం.. ప్రగతికి ఆటంకం
[ 05-07-2024]
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు. -
చీకట్లో బాధితులు.. రెండు గంటలు అవస్థలు
[ 05-07-2024]
మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం గందరగోళాన్ని సృష్టించింది. -
అతిక్రమిస్తే.. తప్పదు మూల్యం
[ 05-07-2024]
మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. -
ఏడు సవాళ్లు.. అధిగమిస్తేనే అవకాశాలు
[ 05-07-2024]
క్రీడలను కెరీర్గా మల్చుకోవాలనుకుంటున్న విద్యార్థులను తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట క్రీడా పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయి. -
‘భోజనం’.. జర పైలం!
[ 05-07-2024]
ఇంట్లో ఒకరిద్దరికి వంట చేయడం సులువే. వంట గదిని శుభ్రంగా ఉంచడం ఇబ్బందేమీ కాదు. కానీ వందల మందికి వంట చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. -
ఖరీదైన వైద్యం.. అందితేనే వ్యాధి నయం
[ 05-07-2024]
తమ ఇంట తొలి సంతానంగా కొడుకు జన్మించినందుకు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. -
బస్సులో గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
[ 05-07-2024]
నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులో నిందితుడి కోసం వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వస్తున్న సీఐడీ ఏఎస్ఐ సెట్విన్ బస్సులో గుండెపోటుతో మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
-
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
-
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న