ఇంటర్సిటీ రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు
ఆదిలాబాద్-నాందేడ్ మధ్య ఇంటర్సిటీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం రద్దు చేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు
ఎదులాపురం, న్యూస్టుడే: ఆదిలాబాద్-నాందేడ్ మధ్య ఇంటర్సిటీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం రద్దు చేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆదిలాబాద్ నుంచి కిన్వట్, నాందేడ్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు, ఆ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్కు రావాల్సిన ప్రయాణికులు ఇంటర్సిటీ రైలు రద్దు చేయటంతో నానాయాతనకు గురయ్యారు. ఇంటర్సిటీ రైలు ఉదయం ఎనిమిది గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి నాందేడ్ వెళ్తుంది. అక్కడి నుంచి మళ్లీ సాయంత్రం మూడు గంటలకు బయలుదేరి ఆదిలాబాద్కు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. అనంతరం ఇదే కృష్ణా ఎక్స్ప్రెస్గా రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది. కృష్ణా ఎక్స్ప్రెస్ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆదిలాబాద్కు చేరుకోవాల్సి ఉండగా ఆలస్యం కావటంతో ఇంటర్సిటీ రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్కు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి వైపు ట్రాక్ సమస్యల కారణంగా పదకొండు గంటలకు చేరుకుంది. దీంతో ఇంటర్సిటీ రైలులో వెళ్లాల్సిన ప్రయాణికులు మధ్యాహ్నం నందిగ్రాం రైలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రైళ్ల రద్దును ఒక రోజు ముందుగా ప్రకటించకుండా అదే రోజు ప్రకటిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురికావటం పరిపాటిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువు ముగుస్తోంది.. పనులు ఇవ్వండి
[ 27-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘంనిధుల పనుల మంజూరు ఉత్తర్వులపై పంచాయితీ నెలకొంది. -
కొద్దిపాటి నిర్లక్ష్యం.. అమ్మకానికి కష్టం
[ 27-06-2024]
కుమురంభీం జిల్లా రెబ్బెన మండలానికి చెందిన ఓ వ్యక్తి 2018లో ట్రాలీని కొనుగోలు చేశారు. ఆ సమయంలో వాహనానికి హైసెక్యూరిటీ నెంబరు ప్లేటును అమర్చుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. నామఫలకం ఏర్పాటు చేసుకోలేదని రాష్ట్ర రవాణాశాఖలో సమాచారం నిక్షిప్తమైంది. -
గతుకుల గండం తీరేనా?
[ 27-06-2024]
కోటపల్లి మండలంలో గతేడాది కురిసిన వర్షాలకు పారుపెల్లి-వెంచపల్లి గ్రామాలమధ్య ఆర్అండ్బీ రహదారి వరద నీటితో కోతకు గురైంది. అప్పుడు దాదాపు 100 మీటర్ల పొడవునా బీటీ కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్ధరించారు. -
అక్రమ నిర్మాణాలు.. అడ్డుకోని అధికారులు
[ 27-06-2024]
టీచర్స్ కాలనీ వద్ద ఉన్న ఈ రోడ్డు పక్కన ఓ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. పురపాలిక ఆధ్వర్యంలో నిర్మాణానికి ఓ వైపు సీసీరోడ్డు, ఇరువైపులా కాలువ నిర్మాణం చేపట్టారు. అధికారులు ఈ రోడ్డు వెడల్పు 25 ఫీట్లు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. -
లెక్క తేలుతున్న చిక్కులు
[ 27-06-2024]
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా శుద్ధనీరు అందించడానికి చేపట్టిన పైప్లైన్ పనులు, కుళాయి కనెక్షన్లు అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. -
బిల్లులు రాక.. అవస్థలు
[ 27-06-2024]
జిల్లాలో గత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ప్రారంభించింది. ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల ప్రారంభించి మధ్యలోనే వదిలేయగా, కొన్ని చోట్ల ప్రారంభించలేదు. -
ఆరోగ్యానికి మేలు.. అతివలకు ఆదాయ వనరు!
[ 27-06-2024]
గిరిజనులు పూజించే ఇప్పచెట్టు.. నేడు వారికి ఎన్నోరకాలుగా ఉపాధి చూపుతోంది. ఇప్పనూనె, లడ్డూలు, హల్వా, కేక్లను సైతం ఇప్పపూలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్నారు. -
అక్రమ నిమాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుదాం
[ 27-06-2024]
నిర్మల్ను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. -
కాలుష్యాన్ని పసిగడతారు
[ 27-06-2024]
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40(పీఎం 10) ఉండాలి కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదు అవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది. -
దోమను తరిమేద్దాం!
[ 27-06-2024]
వర్షాకాలం వచ్చేసింది.. రహదారులు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాలు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, ఖాళీ టైర్లు.. ఇలా నీరు నిల్వ ఉన్న ప్రతీ చోట దోమలు వృద్ధి చెంది రోగాలవ్యాప్తికి కారణం అవుతుంటాయి. వీటి బారిన పడి రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడటం ఏటా నిత్య కృత్యంగా మారుతోంది. -
లక్ష్యం చేరని తునికాకు సేకరణ
[ 27-06-2024]
జిల్లాలో అటవీశాతం అధికంగా ఉండటంతో ఉపాధికోసం గిరిజనులు, ఇతర కూలీలు తునికాకు సేకరణపై ఆధారపడతారు. ఈ ఏడాది దోబూచులాట మధ్య చివరి సమయంలో ఆకు సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. అటవీ శాఖ టెండర్లు పిలవడంతో.. కొందరు గుత్తేదారులు పాల్గొన్నారు. -
షాట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. రూ.1.13 లక్షల నష్టం
[ 27-06-2024]
మండలంలోని గోలేటిలో బుధవారం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి ఓ ఇంటితోపాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా.. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి క్వార్టర్ల సమీపంలో నివాసముంటున్న సిరికొండ తిరుపతి ఇంట్లో కూలర్తో విద్యుత్తు షాట్ సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అలా ఆడడంపైనే మా దృష్టి.. ఇంగ్లాండ్తో సెమీస్పై కెప్టెన్ రోహిత్
-
తుక్కు దుకాణానికి పాఠ్యపుస్తకాలు.. పోలీసులకు సమాచారమిచ్చిన తల్లిదండ్రులు
-
నటుడు పృథ్వీపై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత
-
ఫైనల్కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గాన్పై అలవోక విజయం
-
అమరావతిలో పెట్టుబడులు పెట్టండి.. కర్ణాటక వ్యాపారవేత్తలకు చంద్రబాబు పిలుపు
-
అరాచకాలు చేసి.. అడ్డంగా దొరికేసి..