- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime News: గుంటూరు జిల్లాలో నడి రోడ్డుపై అత్యంత పాశవిక దాడి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఓ వ్యక్తిపై అత్యంత పాశవికంగా దాడి చేయడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఓ వ్యక్తిపై అత్యంత పాశవికంగా దాడి చేయడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి కిరాతకంగా బండరాయితో మోదాడు. దెబ్బలు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా చావబాదారు. ఇనుప రాడ్లు, జాకీలతోనూ విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈఘటనలో గాయపడిన వ్యక్తిని సైదాగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాధితుడి కథనం ప్రకారం... పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా వివాహ వేడుకకు హాజరై ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. పిడుగురాళ్ల శివారులోకి రాగానే ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన పలువురు దాడికి పాల్పడ్డారు. పార్టీల పరంగా పాతకక్షలు , పొలం గట్ల వివాదంలో గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపారు. నడిరోడ్డుపై దాడి జరుగుతున్నా .. అటుగా వెళ్తున్న వారు చూస్తుండిపోయారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదని బాధితుడు వాపోయాడు.
సైదాపై దాడిని ఖండించిన లోకేశ్, అచ్చెన్నాయుడు
గుంటూరుజిల్లా పిడుగురాళ్ల శివారులో సైదాపై అత్యంత పాశవికంగా జరిగిన దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. తెదేపా కార్యకర్త సైదాపై వైకాపా రౌడీ మూకలు నరరూప రాక్షసులకంటే ఘోరంగా దాడి చేశాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం తగాదా సాకుతో వైకాపా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తెదేపా ఏజెంట్గా పనిచేశారనే కక్షతోనే దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల తీరుతో వైకాపా మూకలు బరితెగిస్తున్నాయన్నారు.
సైదాపై దాడి వైకాపా ఆకృత్యాలకు నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు. నాలుగు రోజుల క్రితం దాడి జరిగినా కేసు పెట్టరా అని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది కాపాడటానికా? దాడులు చేయించటానికా అని నిలదీశారు. సైదాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్చేశారు. సైదా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అనిశా వలలో డీసీఎంఎస్ మేనేజర్
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్ డీసీఎంఎస్(జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు. -
వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. -
రూ.10.61 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
రూ.లక్షల విలువైన రేషన్ బియ్యం ఓ రైసు మిల్లులో అధికారులకు పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరంలోని శ్రీరామకృష్ణ రైసు మిల్లుపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు దాడులు చేశారు. -
చదువుకున్నారు.. చోరీలను ఎంచుకున్నారు!
ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు. -
వైకాపా ప్రచార రథం తగలబెట్టింది మాజీ ఎంపీ భరత్రామ్ అనుచరుడే
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటికొచ్చాయి. -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆర్థిక సమస్యలను తట్టుకోలేక గురువారం నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయతండాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
22 ఏళ్ల తర్వాత పట్టుబడిన సామూహిక అత్యాచార నిందితుడు
సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి 22 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటుచేసుకుంది. -
హాథ్రస్ ఘటనలో ఆరుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 121 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
అత్యాచార ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి
ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్టెల్ కస్టమర్ల డేటా లీక్?.. ఖండించిన టెలికాం సంస్థ
-
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
-
హైదరాబాద్ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి
-
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
-
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!