Adluri Laxman: కారు బోల్తా.. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.  

Updated : 19 Feb 2024 07:41 IST

ధర్మపురి గ్రామీణం: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి ధర్మపురికి  వస్తుండగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబర్‌పేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఇద్దరు గన్‌మెన్‌లు, డ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డారు. లక్ష్మణ్ కుమార్‌ను చికిత్స కోసం తొలుత కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని