- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sextortion: అందంతో వల.. చిక్కారో విలవిల
మనుషుల్ని అపహరించి డబ్బు వసూలు చేయడం ఎక్స్టార్షన్. అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం సెక్స్టార్షన్.
రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులు
ఈ ఏడాది రూ.4.58 కోట్లు కోల్పోయిన బాధితులు
వెలుగుచూడని ఉదంతాలెన్నో...
అప్రమత్తతే శ్రీరామరక్ష అంటున్న పోలీసులు
ఈనాడు, హైదరాబాద్: మనుషుల్ని అపహరించి డబ్బు వసూలు చేయడం ఎక్స్టార్షన్. అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం సెక్స్టార్షన్. నేరాలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు... మనుషుల బలహీనతను పెట్టుబడిగా పెట్టి ఆటాడుకుంటున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితులు చాలా సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాళ్లకు అడిగినంత ముట్టజెబుతూ అల్లాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కారణంగానే జరుగుతున్న నేరాల కంటే నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈ తరహా కేసులు 2,125 మాత్రమే నమోదైతే బాధితులు ఏకంగా రూ.4,58,17,808 నష్టపోవడం గమనార్హం. సైబర్ నేరాలకు చిరునామాగా మారిన రాజస్థాన్లోని భరత్పుర్, ఝార్ఖండ్లోని జామ్తారా కేంద్రాలుగా ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సెల్ఫోన్లలో పోర్న్సైట్లను, శృంగారపరమైన వీడియోలను వీక్షించే వారి సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారి వివరాలను సేకరించడానికే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పోర్న్ సైట్ల లాంటివి నడుపుతుంటాయి. ఒక్కసారి వీటిని చూస్తే ఐపీ చిరునామా ద్వారా సంబంధిత ఫోన్ యజమాని సమాచారమంతా సైట్ల నిర్వాహకులకు తెలిసిపోతుంది. ఈ వివరాలను వీరు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటారు. ఇలా సేకరించిన నంబర్లకు తొలుత అందమైన అమ్మాయి డీపీ ఉన్న ఫోన్ నుంచి ‘హాయ్’ అంటూ మెసేజ్ పెడతారు. దానికి స్పందించకుంటే ఫోన్ చేస్తారు. ఒక్కసారి ఫోన్ ఎత్తితే తీయటి మాటలతో వల వేస్తారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియోకాల్ మాట్లాడుకుందామంటూ... ముగ్గులోకి దింపుతారు. అందుకు సిద్ధమవగానే మరింత రెచ్చగొట్టేందుకు వీడియో కెమెరా ముందే అమ్మాయిలు నగ్నంగా మారిపోతారు. మాటలతో మభ్యపెట్టి అవతలి వ్యక్తిని కూడా నగ్నంగా మారాలంటూ ప్రేరేపిస్తారు. వారి మాటలకు లొంగిపోయి నగ్నంగా మారితే ఇక అయిపోయినట్లే. ఆ వ్యవహారమంతా రికార్డు చేస్తారు. వెంటనే బెదిరింపులకు దిగుతారు. ‘నువ్వు నగ్నంగా మారిన వీడియో చిత్రాలు మా వద్ద ఉన్నాయి. వాటిని యూట్యూబ్లో పెడతాం. కావాలంటే చూడు’ అంటూ ఒక లింక్ పంపిస్తారు. అందులో బాధితుడి నగ్న వీడియో ఉంటుంది. ‘ఈ వీడియోను నీ ఫేస్బుక్ మిత్రులందరికీ పంపుతాం’ అంటూ మరింత బెదిరిస్తారు. అలా జరక్కుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలని బేరం పెడతారు. పరువు పోతుందన్న ఉద్దేశంతో చాలామంది బాధితులు ముందు అడిగినంత డబ్బు చెల్లిస్తున్నారు. ఇక తమవల్ల కాదనుకున్న పరిస్థితుల్లోనే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా చాలా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. పేరుకి ఎవరో మహిళ ఇదంతా నిర్వహిస్తున్నట్లు కనిపించినా వెనుక పెద్ద ముఠానే పనిచేస్తుంది.
ఇవే ఉదాహరణలు...
- ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వైద్యుడికి సామాజిక మాధ్యమాల్లో ఓ యువతి పరిచయమైంది. కొద్ది రోజుల తర్వాత వాట్సప్లో వీడియోకాల్లో మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాత యువతి నగ్నంగా కాల్స్ చేయడం మొదలుపెట్టింది. వీటిని అడ్డం పెట్టుకొని ఏకంగా రూ.70 లక్షలు వసూలు చేసింది. అప్పటికీ వసూళ్ల దాహం ఆగకపోవడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులను ఆశ్రయించారు.
- శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారికి నేరగాళ్లు వలవేశారు. ఆయన ఫోన్కు వాట్సప్ వీడియోకాల్ చేశారు. ఫోన్ ఎత్తి కొద్దిసేపు మాట్లాడారు. అప్పటి నుంచి వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్ చేస్తున్న ముఠా.. ‘మీ నగ్న ఫొటోలు ఉన్నాయి, వాటిని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తామ’ని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాల్స్ అన్నీ పశ్చిమబెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
- ఆయనో ప్రభుత్వోద్యోగి. ఫేస్బుక్లో ఒక మహిళ పరిచయమైంది. వారం రోజుల తర్వాత ఫోన్ నంబర్ అడిగింది. అప్పటి నుంచి వాట్సప్ కాల్స్లో నగ్నంగా మారిపోయి మాట్లాడేది. అతను కూడా ఆమె ఉచ్చులో పడ్డాడు. కొద్దిరోజుల తర్వాత నుంచి వేధింపులు మొదలయ్యాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆయన నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం మొదలుపెట్టింది. దాదాపు రూ.5 లక్షలు చెలించినా ఆమె ఆగడాలు ఆగకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
- ఆయన ఒక విశ్రాంత అధికారి. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిన ఆయనకు ఓ యువతి పరిచయమైంది. నగ్న వీడియోకాల్స్తో ముగ్గులోకి దింపింది. ఈ వ్యవహారం మొత్తాన్ని రికార్డు చేసి ఆ తర్వాత నుంచి బెదిరింపులు మొదలుపెట్టింది. రూ.పది లక్షలు చెల్లించినా ఆగడాలకు తెరపడకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...
- గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దు.
- తెలియని వ్యక్తులు పంపే ఫ్రెండ్ రిక్వెస్టులను పట్టించుకోవద్దు. ఇటువంటి వాటిని వెంటనే బ్లాక్ చేయాలి.
- సామాజిక మాధ్యమాల ద్వారా వల వేయాలని చూస్తారు. ఇక్కడ పరిచయం పెంచుకొని ఫోన్ నంబర్ తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా కథ నడిపిస్తారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తగా ఉండాలి.
- పోర్న్ సైట్లు చూసేవారికి ఈ ప్రమాదం ముప్పు ఎక్కువ. వీరి కంప్యూటర్లు, ఫోన్లకు ఉన్న కెమెరాలను హ్యాక్ చేస్తున్న నేరగాళ్లు వాటి ద్వారా రికార్డు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అసలీ సైట్ల జోలికే వెళ్లొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య.. వాహనం వదిలి పరార్
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. -
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. -
కత్తి దూసిన ప్రేమోన్మాదం
తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. -
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
విజయవాడ అజిత్సింగ్నగర్ లూనా సెంటర్లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. -
బతుకులు ఛిద్రం!
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఆయువు తీసిన అతివేగం
అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
-
ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం
-
విజయవాడ-జగదల్పూర్ హైవేలో మార్పులు కోరాం: మంత్రి తుమ్మల
-
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
-
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం