Nellore: స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టింది.

Updated : 02 Jul 2024 11:25 IST

కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా: మంత్రి నారా లోకేశ్‌

కావలిలో జరిగిన స్కూల్‌ బస్సు ప్రమాద ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ‘‘పాఠశాల బస్సును లారీ ఢీకొని క్లీనర్‌ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా. పాఠశాల యాజమాన్యాలు బస్సులు సరిగా నిర్వహించాలి. బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని అధికారులకు లోకేశ్ సూచించారు.

విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు