- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nellore: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది.
కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా: మంత్రి నారా లోకేశ్
కావలిలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘పాఠశాల బస్సును లారీ ఢీకొని క్లీనర్ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా. పాఠశాల యాజమాన్యాలు బస్సులు సరిగా నిర్వహించాలి. బస్సుల ఫిట్నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని అధికారులకు లోకేశ్ సూచించారు.
విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమపెళ్లి విఫలం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య!
ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. -
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి భర్తను భార్య అంతమొందించిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చిన్న తుమ్మడిలో చోటు చేసుకుంది. -
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రైలు ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం.. ఘట్కేసర్ వద్ద ఘటన
ఘట్కేసర్: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బీబీనగర్-ఘట్కేసర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
నీపై దయ చూపడమా?: కోర్టు వ్యాఖ్య
కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు. -
పాపం.. విలవిల్లాడిన పసికూనలు
స్కూల్ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. -
జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. -
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
బీరు కోసం గొడవపడి బర్త్డే బాయ్ని ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో అంతస్తు నుంచి తోసేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలకు బస్సుల్లో బయల్దేరిన అమరావతి ప్రాంత రైతులు
-
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల కొత్త ధరలు ఇవే..
-
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు: కేటీఆర్
-
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
-
మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు