Hyderabad: టిప్పర్‌ను ఢీకొట్టిన కారు.. అక్కచెల్లెళ్లు సహా నలుగురి మృతి

హైదరాబాద్‌ శివారు నార్సింగి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. 

Updated : 19 May 2023 14:17 IST

నార్సింగి: హైదరాబాద్‌ శివారు నార్సింగి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపిన టిప్పర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కారులో అక్కచెల్లెళ్లు అర్షిత, అంకితతో పాటు వారి స్నేహితులు నితిన్‌, అమృత్‌, మరికొందరు ఉన్నారు. ఘటనాస్థలంలోనే అక్కచెల్లెళ్లు, నితిన్‌ మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమృత్‌ చనిపోయాడు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను నిజాంపేట్‌ వాసులుగా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని