Road accident: పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం

మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన     ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 03 Jul 2024 05:12 IST

ప్రమాదానికి ముందు కారులో నలుగురు యువకులు తీసుకున్న సెల్ఫీ
కంగ్టికి చెందిన ఫిరోజ్‌ ఖురేషీ

నారాయణఖేడ్, నారాయణఖేడ్‌ రూరల్‌: మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా 27 ఏళ్లలోపు వారే. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన మహబూబ్‌ ఖురేషీ, రఫీక్‌ ఖురేషీ, ఫిరోజ్‌ ఖురేషీ, కంగ్టి గ్రామానికి చెందిన ఫిరోజ్‌ ఖురేషీ, వెంకటాపూర్‌కు చెందిన సయ్యద్‌ అమర్, సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన మజీద్‌ పటేల్‌ రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ దర్గాకు ఆదివారం కారులో వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రం పుణె సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో మహబూబ్, రఫీక్, ఫిరోజ్, మజీద్‌ పటేల్, ఫిరోజ్‌ ఖురేషీ(కంగ్టి) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ సయ్యద్‌ అమర్‌ పుణె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని