- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Road accident: పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి ముందు కారులో నలుగురు యువకులు తీసుకున్న సెల్ఫీ
కంగ్టికి చెందిన ఫిరోజ్ ఖురేషీ
నారాయణఖేడ్, నారాయణఖేడ్ రూరల్: మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా 27 ఏళ్లలోపు వారే. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మహబూబ్ ఖురేషీ, రఫీక్ ఖురేషీ, ఫిరోజ్ ఖురేషీ, కంగ్టి గ్రామానికి చెందిన ఫిరోజ్ ఖురేషీ, వెంకటాపూర్కు చెందిన సయ్యద్ అమర్, సిర్గాపూర్ గ్రామానికి చెందిన మజీద్ పటేల్ రాజస్థాన్లోని అజ్మేర్ దర్గాకు ఆదివారం కారులో వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రం పుణె సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో మహబూబ్, రఫీక్, ఫిరోజ్, మజీద్ పటేల్, ఫిరోజ్ ఖురేషీ(కంగ్టి) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ అమర్ పుణె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనిశా వలలో డీసీఎంఎస్ మేనేజర్
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్ డీసీఎంఎస్(జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు. -
వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. -
రూ.10.61 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
రూ.లక్షల విలువైన రేషన్ బియ్యం ఓ రైసు మిల్లులో అధికారులకు పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరంలోని శ్రీరామకృష్ణ రైసు మిల్లుపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు దాడులు చేశారు. -
చదువుకున్నారు.. చోరీలను ఎంచుకున్నారు!
ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు. -
వైకాపా ప్రచార రథం తగలబెట్టింది మాజీ ఎంపీ భరత్రామ్ అనుచరుడే
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటికొచ్చాయి. -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆర్థిక సమస్యలను తట్టుకోలేక గురువారం నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయతండాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
22 ఏళ్ల తర్వాత పట్టుబడిన సామూహిక అత్యాచార నిందితుడు
సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి 22 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటుచేసుకుంది. -
హాథ్రస్ ఘటనలో ఆరుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 121 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
అత్యాచార ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి
ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ