Road accident: మెదక్‌ జిల్లాలో రెండు లారీలు ఢీ: నలుగురు మృతి

మెదక్‌ జిల్లాలో ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు.   

Updated : 28 Jun 2024 06:46 IST

మెదక్‌: రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్‌రోడ్డుపై జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెనక లారీలో క్యాబిన్‌లో కూర్చున్న నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని