Road Accident: దంతాలపల్లిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 05 Jul 2024 23:26 IST

దంతాలపల్లి : మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ఆటో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులను మల్లేశ్‌, కుమార్‌, నరేశ్‌లుగా గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని