Hyderabad: జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు

నగరంలోని పలు పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Published : 30 Jun 2024 19:10 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు పబ్బుల్లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పరిధిలో ఉన్న వివిధ పబ్బుల్లో నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు శిక్షణ ఇచ్చిన స్నిఫర్‌ డాగ్స్‌ సాయంతో సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న పోలీసులు కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని