- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kerala: కేరళలోని కలమస్సేరీ కన్వెన్షన్ సెంటర్లో పేలుళ్లు.. ఒకరి మృతి
కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన సమయంలో అక్కడ వేల మంది ఉన్నారు.
ఇంటర్నెట్డెస్క్: కేరళలోని కలమస్సేరీలో ఆదివారం ఉదయం పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో 23 మంది గాయపడ్డారు. కలమస్సేరీ నెస్ట్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 9.30 సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ వేల మంది ఉన్నట్లు సమచారం.
ప్రత్యక్ష సాక్షులు మాత్రం కన్వెన్షన్ హాల్లో మూడు నుంచి నాలుగు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. కన్వెన్షన్ హాలులో దాదాపు 2,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం చోటు చేసుకొంది. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
పేలుళ్లలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులను కలమస్సేరీ మెడికల్ కాలేజీ, ఎర్నాకులం జనరల్ హాస్పిటల్, కొట్టాయం మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నారు.
ఆధారాలు సేకరిస్తున్నాం: కేరళ ముఖ్యమంత్రి
ఈ వరుస పేలుళ్ల ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ‘‘ఇదో దురదృష్టకర ఘటన. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులు మొత్తం ఎర్నాకులంలో ఉన్నారు. డీజీపీ ఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను ఇప్పటికే డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.
ఇది అనాగరిక చర్య : శశిథరూర్
కలమస్సేరీలో వరుస పేలుళ్లను మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ‘మతపరమైన ప్రార్థనలో బాంబుదాడుల వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిని నేను ఖండిస్తున్నాను. సత్వరమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. మతపెద్దలు అందరు ఏకమై ఈ అనాగరిక చర్యను ఖండించాలి’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తి దూసిన ప్రేమోన్మాదం
తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. -
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
విజయవాడ అజిత్సింగ్నగర్ లూనా సెంటర్లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. -
బతుకులు ఛిద్రం!
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఆయువు తీసిన అతివేగం
అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
-
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు తీవ్ర అస్వస్థత
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి