- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రైలు ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం.. ఘట్కేసర్ వద్ద ఘటన
ఘట్కేసర్: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బీబీనగర్-ఘట్కేసర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘట్కేసర్: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బీబీనగర్-ఘట్కేసర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహం.. ఘట్కేసర్ వరకు సుమారు 5 కి.మీ వేలాడుతూ వచ్చింది. అక్కడి రైల్వేగేటు వద్ద రైలు ఇంజిన్కు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘట్కేసర్ దాటాక రైలు ఆపించిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. మృతదేహాన్ని తొలగించారు. మృతిచెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కా, ఆరెంజ్ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనిశా వలలో డీసీఎంఎస్ మేనేజర్
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్ డీసీఎంఎస్(జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు. -
వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. -
రూ.10.61 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
రూ.లక్షల విలువైన రేషన్ బియ్యం ఓ రైసు మిల్లులో అధికారులకు పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరంలోని శ్రీరామకృష్ణ రైసు మిల్లుపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు దాడులు చేశారు. -
చదువుకున్నారు.. చోరీలను ఎంచుకున్నారు!
ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు. -
వైకాపా ప్రచార రథం తగలబెట్టింది మాజీ ఎంపీ భరత్రామ్ అనుచరుడే
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటికొచ్చాయి. -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆర్థిక సమస్యలను తట్టుకోలేక గురువారం నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయతండాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
22 ఏళ్ల తర్వాత పట్టుబడిన సామూహిక అత్యాచార నిందితుడు
సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి 22 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటుచేసుకుంది. -
హాథ్రస్ ఘటనలో ఆరుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 121 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
అత్యాచార ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి
ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే