- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime News: మద్యం మత్తులో యువకుడిని కారుతో ఢీకొట్టిన వైకాపా ఎంపీ కుమార్తె!
ఫుట్పాత్పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్నగర్కు చెందిన సూర్య (22) పెయింటర్.
అరెస్టు చేసిన చెన్నై పోలీసులు
చెన్నై (ప్యారిస్), న్యూస్టుడే: ఫుట్పాత్పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్నగర్కు చెందిన సూర్య (22) పెయింటర్. సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో బెసంట్నగర్ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఫుట్పాత్పై నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్పాత్పైకి దూసుకొచ్చి సూర్యపై ఎక్కింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతణ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలున్నట్లు తెలిసింది. వాహనం నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో పాటు పరారయింది. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన ప్రజలతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఇద్దరు మహిళలూ మద్యం మత్తులో ఉన్నట్లు సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్ నెంబరు, పారిపోయిన మహిళల ఫొటోలున్నా వారిని అరెస్టు చేయలేదని వారు సోమవారం రాత్రి బెసంట్నగర్ పోలీసుస్టేషన్ను ముట్టడించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు చెందిన రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తె బీద మాధురిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కానిస్టేబుల్పై ఇసుక మాఫియా హత్యాయత్నం!
ఇసుక మాఫియా బరితెగించింది. అక్రమ రవాణాను అడ్డుకొని, ఇసుక ట్రాక్టర్కు బందోబస్తుగా ఉండి స్టేషన్కు తరలిస్తున్న కానిస్టేబుల్పై హత్యాయత్నానికి తెగబడింది. -
భార్యను కడతేర్చిన భర్త
కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు.. జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిత్రీకరించాడు. -
మహిళల దుస్తులు ధరించి విమానాశ్రయ అధికారి ఆత్మహత్య
మహిళల దుస్తులు ధరించిన విమానాశ్రయ అధికారి ఒకరు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. -
తెదేపా నాయకురాలి దారుణహత్య
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో తెదేపా నాయకురాలు అట్ల శ్రీదేవి (55) మంగళవారం హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అట్ల భాస్కర్రెడ్డి, అతని తమ్ముడు అట్ల గోపాల్రెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. -
జంతు హింసపై కేసు నమోదు
కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి చెందిన వినోద్ తన పెంపుడు కుక్కను హింసించాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. వినోద్ కుక్క రెండు కాళ్లు పట్టుకొని పైకి లేపి తిప్పుతూ ఇబ్బందికి గురి చేశాడు. -
మహిళపై దాడి చేసి తల లాక్కెళ్లిన చిరుత
వంట చెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల, మహానంది మండలాల సరిహద్దు ప్రాంతంలోని పచ్చర్ల గ్రామంలో చోటుచేసుకుంది. -
ఏసీబీకి పట్టుబడిన వెల్దండ ఎస్సై
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై రవి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబట్టారు. -
బాలుడి ఊపిరి తీసిన చీర ఊయల!
ఊయల ఊగుతున్న పదకొండేళ్ల బాలుడు.. మెలితిరిగిన చీర ఊయల మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. తెలంగాణలోని కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కడుపు మాడుస్తున్నారు సార్.. ఎమ్మెల్యే ఎదుట విలపించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని
-
అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి.. దుండగుడి ఆత్మహత్య!
-
అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రతిపక్ష హోదాపై జగన్ రకరకాల మాటలు
-
ఒక్కో బస్సులో.. 200 మంది విద్యార్థులు!
-
డామిట్.. కథ అడ్డం తిరిగింది!.. తెరపైకి కడప వైకాపా నేత హత్య కేసు