Crime news: కాగజ్‌నగర్‌లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం గజ్జెడలో నలుగురు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.

Published : 01 Jul 2024 19:46 IST

కుమురంభీం ఆసిఫాబాద్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం గజ్జెడలో నలుగురు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ ముగ్గురు కుమార్తెలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేకే తన కూతుళ్లతో కలిసి మహిళ బలవన్మరణానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని