- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG News: మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసుల సోదాలు
సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈనాడు, హైదరాబాద్: సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్ కిషన్గంజ్ డివిజన్లోని బరాసత్, కృష్ణనగర్ సెక్షన్ల పరిధిలో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాత విద్యుత్తు లైన్లను తొలగించి కొత్తవి నిర్మించేందుకు మధుకాన్ సంస్థ 2012లో కోల్కతాకు చెందిన మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థకు రూ.19.19 కోట్లు, రూ.13.32 కోట్లతో రెండు వేర్వేరు పనులను సబ్కాంట్రాక్టు ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ పనులు పూర్తిచేసింది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మధుకాన్ సంస్థ బిల్లులు చెల్లించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మధుకాన్ సంస్థను భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) సస్పెండ్ చేసింది. అప్పగించిన ప్రాజెక్టులనూ వెనక్కు తీసుకుంది. ఇదిలా ఉండగా తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ సొసైటీ సంస్థ పలుమార్లు మధుకాన్ ప్రతినిధులను కోరుతూ వస్తోంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో 2022 జులై 27న కోల్కతాలోని బౌబజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా కోల్కతా పోలీసులు మధుకాన్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలుపత్రాలు, హార్డ్డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
Crime News: మార్కులు తక్కువొచ్చాయని మందలించినందుకు టీచర్నే కడతేర్చాడు ఓ విద్యార్థి. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు
మణికొండలోని కేవ్ పబ్లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్వోటీ పోలీసులు సోదాలు చేశారు. -
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. -
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. -
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. -
గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు
గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. -
పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
సిమ్కార్డుల దందాలో యూపీ లింకులు..!
దొంగచాటుగా సిమ్కార్డులు విక్రయించడం ద్వారా సైబర్ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. -
చిన్నారిని విక్రయించిన వైద్యులు
బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. -
బాధితుల మౌనమే సైబర్ నేరగాళ్లకు వరం
సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?