- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kurnool: వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి.
పదిహేడేళ్ల యువతిపై మూడేళ్లుగా అఘాయిత్యం
డాక్టర్ సుధాకర్పై పోక్సో కేసు నమోదు
అరెస్టు చేసి కోర్టుకు తరలింపు
మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు
ఈనాడు- కర్నూలు, న్యూస్టుడే- కర్నూలు నేర విభాగం, ఓర్వకల్లు: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చింది. కర్నూలు రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
‘నా తల్లిదండ్రులు సుధాకర్ ఇంట్లో పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లలో వారు పనికి వెళ్లనప్పుడల్లా నేనే వెళ్లేదాన్ని. ఆ సమయంలో సుధాకర్ నన్ను లైంగికంగా వేధించేవారు. ఆయన భార్య ఇంట్లో లేనప్పుడు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. అశ్లీల చిత్రాలు చూపించేవారు. ఆయన నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఓరోజు నేనే సెల్ఫోన్లో ఆ వేధింపులను రహస్యంగా రికార్డు చేశాను. ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ధైర్యం చేసి ఎవరికీ చెప్పలేకపోయాను. గతేడాది నవంబరు నెలాఖరు వరకు దాదాపు మూడేళ్లు ఆయన నన్ను లైంగికంగా వేధించారు’ అని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రెండో పట్టణ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 376తోపాటు మైనర్ కావడంతో పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్విత్ 5(ఎల్) కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని తొలుత ఓర్వకల్లు పోలీస్స్టేషన్కు, తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. బాధితురాలిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. నిందితుణ్ని గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఎం.సరోజనమ్మ.. ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు. దీంతో సుధాకర్ను జిల్లా కారాగారానికి తరలించారు.
నెలన్నర కిందటే వీడియోలు వైరల్
డా.సుధాకర్ సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సార్వత్రిక ఎన్నికల రోజు సాయంత్రమే వెలుగులోకి వచ్చాయి. అందులో యువతి ఎవరన్నది తెలియకపోవడం, ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యవహారం మరుగునపడింది. అప్పట్లో ఎమ్మెల్యేగా తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను భయపెట్టి విషయం బయటకు రాకుండా కొందరు పెద్దలతో రాజీ చేయించినట్లు సమాచారం.
వైకాపా నేతలపై తగ్గని పోలీసుల ప్రేమ
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్టు విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన వైకాపాపై వారి విధేయత ఏ మాత్రం తగ్గలేదని చాటింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసిన కర్నూలు రెండో పట్టణ పోలీసులు సుధాకర్ను ఇంటికెళ్లి అరెస్టు చేశారు. ఎక్కడా మీడియా కంటపడకుండా రహస్యంగా ఓర్వకల్లు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేషన్లోకి ఎవర్నీ రానీయలేదు. తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చాక కూడా ప్రహరీ గేటు మూసేసి, లోపలికి ఎవరూ రాకుండా చూశారు. చీకటిపడేవరకు కోర్టుకు తీసుకురాకుండా న్యాయమూర్తి ఇంటికి వెళ్లేవరకు జాప్యం చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించాక కూడా ఎవరి కంటా పడకుండా జిల్లా కారాగారానికి సుధాకర్ను తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. -
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. -
భారమనుకుని... నేలకేసి బాది
పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. -
గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు
గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. -
పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
సిమ్కార్డుల దందాలో యూపీ లింకులు..!
దొంగచాటుగా సిమ్కార్డులు విక్రయించడం ద్వారా సైబర్ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. -
చిన్నారిని విక్రయించిన వైద్యులు
బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. -
బాధితుల మౌనమే సైబర్ నేరగాళ్లకు వరం
సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!