Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్లపై తీర్పు రిజర్వు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి.

Published : 26 Jun 2024 21:06 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వు చేసింది. తాము బెయిల్‌ పిటిషన్‌ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్‌ లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కేసులో అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయకపోతే మ్యాండేటరీ/డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్‌వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్‌ వేయనట్లు కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని