Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

Published : 27 May 2024 17:06 IST

సికింద్రాబాద్‌: నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్‌కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్‌ చేసి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని