- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అనిశా వలలో డీసీఎంఎస్ మేనేజర్
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్ డీసీఎంఎస్(జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు.
రూ.లక్ష లంచం తీసుకుంటుండగా క్యాషియర్ సహా పట్టివేత
లంచం తీసుకుంటూ పట్టుబడిన డీసీఎంఎస్ క్యాషియర్ కుమారస్వామిగౌడ్, మేనేజర్ వెంకటేశ్వరరావు
కరీంనగర్ పట్టణం, కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్ డీసీఎంఎస్(జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆయనకు సహకరించిన క్యాషియర్ సుదగోని కుమారస్వామిగౌడ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనిశా కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డీసీఎంఎస్ తన సొంత కేంద్రాలతోపాటు కమీషన్ కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తుంటుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కావేటి రాజు 2018-23 మధ్య కమీషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి వరిధాన్యం కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి డీసీఎంఎస్ నుంచి కమీషన్ రూపేణా రూ.90 లక్షల మేరకు రావాల్సి ఉండగా.. అందులో రూ.20.91 లక్షల విలువైన ఎరువులను సొసైటీ సరఫరా చేసింది. మరో రూ.69.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బు కోసం రాజు కొన్నిరోజులుగా డీసీఎంఎస్ మేనేజర్ చుట్టూ తిరుగుతున్నారు. రూ.15 లక్షలను లంచంగా ఇస్తేనే ఎరువుల రూపంలో కమీషన్ ఇస్తానని వెంకటేశ్వరావు తేల్చిచెప్పారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినలేదు. విసుగు చెందిన రాజు కరీంనగర్ అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బాధితుడు గురువారం మేనేజర్ వెంకటేశ్వరరావుకు కరీంనగర్లోని ఆయన ఛాంబర్లో మొదటి విడతగా రూ.లక్ష లంచం ఇస్తుండగా దాడి చేశారు. రాజు నుంచి కుమారస్వామిగౌడ్ డబ్బులు తీసుకుని వెంకటేశ్వరరావుకు ఇస్తున్న క్రమంలో అనిశా అధికారులు వారిద్దరిని పట్టుకున్నారు. వెంకటేశ్వరరావు, కుమారస్వామిగౌడ్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు
మణికొండలోని కేవ్ పబ్లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్వోటీ పోలీసులు సోదాలు చేశారు. -
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. -
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. -
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. -
గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు
గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. -
పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
సిమ్కార్డుల దందాలో యూపీ లింకులు..!
దొంగచాటుగా సిమ్కార్డులు విక్రయించడం ద్వారా సైబర్ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. -
చిన్నారిని విక్రయించిన వైద్యులు
బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. -
బాధితుల మౌనమే సైబర్ నేరగాళ్లకు వరం
సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు