- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అత్యాచార ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి
ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది.
డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
ఈనాడు-హైదరాబాద్: ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. మియాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక పంపాలని స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీపీకి లేఖ పంపినట్లు జాతీయ మహిళా కమిషన్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
యువతిపై అత్యాచారం కేసులో నిందితులు సంగారెడ్డి, జనార్దన్రెడ్డిలను మియాపూర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. వారిని విచారణ నిమిత్తం కూకట్పల్లి కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురి దుర్మరణం
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా
బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థకు సైబర్ నేరస్థులు నకిలీ మెయిల్ పంపించారు. దాన్ని నమ్మిన సంస్థ నిర్వాహకుల నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్లో ఈ ఉదంతం వెలుగుచూసింది. -
అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో భారీ ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. ముడిపదార్థాన్ని పౌడర్గా మార్చే కిలాన్ విభాగంలోని ట్యాంకు పగిలి.. 800 డిగ్రీల పైగా వేడితో ఉన్న పొడి కార్మికుల మీద పడింది. -
ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కోసి.. రూ. 30 లక్షల దోపిడీ
పక్కా ప్రణాళికతో ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కోసి వాటిలోని రూ.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు ముగ్గురు ముసుగు దొంగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాలలో చోటుచేసుకుంది. -
అవమానాలు భరించలేకే!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. గతనెల 30న రాత్రి మహబూబాబాద్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక మృతిచెందారు. -
ఆ ‘లోన్ యాప్’ వెంటనే తొలగించండి
సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆన్లైనులో అనేక యాప్లు అందుబాటులోకి వస్తున్న రోజులివి. ఇటువంటి యాప్ల అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. -
మద్యం మత్తులో ‘బీఎండబ్ల్యూ’ నడిపి.. మహిళ ఉసురు తీసిన శివసేన యువనేత
పుణెలో జరిగిన టీనేజరు కారు ప్రమాద ఘటన మరవకముందే ముంబయిలో అదే తరహా మరో ప్రమాదం నమోదైంది. శరవేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందారు. -
సర్వే ల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మం నగరంలోని సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ షేక్ అఫ్జల్ హసన్ శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
మందలించాడని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
అస్సాంలోని శివసాగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తక్కువ మార్కులు వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడిని 11వ తరగతి చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
రూ. 2.89 కోట్ల బంగారం స్వాధీనం
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు. -
డ్రగ్స్ తీసుకున్నాకే.. పబ్కు!
గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్లోని ఓ పబ్లో నిర్వహించిన పార్టీ వ్యవహారం కలకలం రేపింది. ఖాజాగూడలోని ‘ది కేవ్’ పబ్ నిర్వాహకులు ‘సైకిడెలిక్’ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడం చూసి పోలీసులే విస్తుపోయారు. -
మొలకెత్తని విత్తనం.. యమపాశమైన రుణభారం!
రెండు సార్లు విత్తనాలు విత్తినా వర్షాలు కురవక మొలకెత్తలేవు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చలేనన్న దిగులుతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రైలు కింద పడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. -
మద్యం మత్తులో ప్రాణం తీశారు
చిన్నపాటి గొడవతో ఓ యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేసిన ఘటనలో నిందితులైన 17, 18 ఏళ్లలోపు ముగ్గురు బాలలను పోలీసులు అరెస్టు చేశారు. -
మెగామాల్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించి.. రూ.కోట్లు కొల్లగొట్టిన నొయిడా కిలాడీలు
మందుల దుకాణం.. డిపార్ట్మెంటల్ స్టోర్.. మెగామాల్స్.. వంటిచోట్ల కొనుగోళ్లు చేసినపుడు బిల్లింగ్ సమయంలో ఫోన్ నంబరు అడుగుతుంటారు. తప్పనిసరి కానప్పటికీ, రివార్డు పాయింట్లు వస్తాయని కొందరు..