- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
భారీగా చౌక బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది.
రైస్మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారుల సోదాలు
బియ్యం బస్తాలతో ఉన్న లారీ
తిరువూరు, న్యూస్టుడే: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం గ్రామానికి చెందిన బొజ్జా చంద్రశేఖర్ (చంద్ర) మునుకుళ్ల, ముష్టికుంట్లకు చెందిన మరో ఇద్దరితో కలిసి రాజుపేటలోని రైస్మిల్లు లీజుకు తీసుకుని కాకినాడ పోర్టుకు చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైకాపాకు చెందిన ఓ మాజీ ఎంపీ, స్థానిక నాయకుల సహకారంతో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని ఎండీయూ వాహనాల నుంచి బియ్యాన్ని సేకరించి రాజుపేటలోని రైస్మిల్లుతో పాటు వీరికి చెందిన గోదాముల్లో నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నారు. రైస్మిల్లులో చౌకబియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు పౌరసరఫరాలశాఖ ఏఎస్వో లక్ష్మీనారాయణ, డీటీ కె.శ్వేత బుధవారం సోదాలు చేశారు. ఎగుమతి చేయడానికి రెండు లారీల్లో సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని బస్తాలతో పాటు, రైస్మిల్లులో విడిగా ఉన్న బియ్యాన్ని గుర్తించారు. విడిగా ఉన్న బియ్యాన్ని తూకం వేసేందుకు వచ్చిన హమాలీలను వ్యాపారి చంద్రశేఖర్ బెదిరించడంతో మధ్యాహ్నం నుంచి వారు వెళ్లిపోయారు. దీంతో మరో ముఠాకు చెందిన హమాలీలను పిలిపించి బియ్యం తూకం వేసి బస్తాలను లెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు బస్తాలను లెక్కించగా 32.5 టన్నుల రేషన్ బియ్యం తూగింది. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
1,482 టన్నుల బియ్యం స్వాధీనం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని గోదాములపై కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల్లో భారీ ఎత్తున రేషన్ బియ్యం బయటపడుతూనే ఉంది. రెవెన్యూ, పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారుల బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. పోర్టు సమీపంలోని సాయితేజ షిప్పింగ్ సర్వీసెస్ గోదాముల నుంచి రూ.3.54 కోట్ల విలువైన 1,482 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాములపై దాడులు కొనసాగుతాయని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారమనుకుని... నేలకేసి బాది
పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. -
పాలకోవాకు వెళ్తే.. ప్రాణాలు పోయాయి!
రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. -
గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు
గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. -
పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
సిమ్కార్డుల దందాలో యూపీ లింకులు..!
దొంగచాటుగా సిమ్కార్డులు విక్రయించడం ద్వారా సైబర్ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. -
చిన్నారిని విక్రయించిన వైద్యులు
బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. -
బాధితుల మౌనమే సైబర్ నేరగాళ్లకు వరం
సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు. -
గుజరాత్ పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ