- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు.
వైఎస్సార్ జిల్లాలో ఘటన
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పోలీసు అధికారులు
కడప నేరవార్తలు, న్యూస్టుడే: వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై అందిన ముందస్తు సమాచారంతో జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్, సీఐ ఈశ్వరయ్య, సిబ్బంది ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్ద కాపు కాశారు. అక్కడ నిలిపి ఉన్న ఓ మినీ లారీని అనుమానంతో పరిశీలిస్తుండగా, అందులో ఉన్న స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనంలో 44 ఎర్రచందనం దుంగలున్నాయి. అక్కడికి సమీపంలోని జగనన్న కాలనీ వైపు నుంచి మరికొంతమంది ఓ ద్విచక్ర వాహనంపై, ట్రాక్టరులో వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని, ట్రాక్టరును పరిశీలించగా.. అందులో 40 ఎర్రచందనం దుంగలున్నాయి. స్థానిక కాలనీకి చెందిన దూదేకుల బాషా ఇంట్లో నిల్వ చేసిన 74 దుంగలను గుర్తించారు. మొత్తం 158 దుంగలు, ఒక మినీలారీ, ఒక ట్రాక్టరు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. అరెస్టైన వారిలో ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన దూదేకుల బాషా, పింజరి మహమ్మద్ రఫి, అరవోళ్ల రఫి, చెల్లుబోయిన శివసాయిలు ఉన్నారు. పోరుమామిళ్ల, బద్వేలు పరిధి నల్లమల అటవీ ప్రాంతంలో చెట్లను నరికి, వాటిని చెన్నైకి తరలించే సమయంలో నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. వీరి వెనక ఉన్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు
మణికొండలోని కేవ్ పబ్లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్వోటీ పోలీసులు సోదాలు చేశారు. -
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. -
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. -
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. -
గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు
గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. -
పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
సిమ్కార్డుల దందాలో యూపీ లింకులు..!
దొంగచాటుగా సిమ్కార్డులు విక్రయించడం ద్వారా సైబర్ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. -
చిన్నారిని విక్రయించిన వైద్యులు
బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. -
బాధితుల మౌనమే సైబర్ నేరగాళ్లకు వరం
సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు.