- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే
బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది.
బాధితులు, నేరస్థుల విషయంలో లింగబేధాలకు చోటు లేదు
భారతీయ న్యాయ సంహితలో నిర్వచిస్తున్న క్లాజులు
దిల్లీ: బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. ఐపీసీలో మైనర్లకు సంబంధించి బాలికలపై జరిగే లైంగిక నేరాలను మాత్రమే శిక్షార్హంగా పరిగణించగా, బీఎన్ఎస్ మాత్రం బాలురపై జరిగే నేరాలనూ శిక్షార్హంగా ప్రకటిస్తోంది. బాధితులతోపాటు నేరస్థుల విషయంలోనూ లింగ భేదాన్ని పక్కన పెట్టింది. ఐపీసీ సెక్షన్ ‘336ఏ’లోని ‘మైనర్ గర్ల్’ అనే పదానికి బదులు ‘చైల్డ్’ అనే పదాన్ని బీఎన్ఎస్ క్లాజ్ 96లో చేర్చారు. దీని ప్రకారం 21 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులను నేరంగా పరిగణిస్తారు. ఐపీసీలోని సెక్షన్ 366బి విదేశాల నుంచి బాలికలను లైంగిక దోపిడీ కోసం దిగుమతి చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తే, దాని స్థానంలో ప్రవేశపెట్టిన బీఎన్ఎస్లోని 141వ క్లాజు 21 ఏళ్లలోపు బాలికలను, 18 ఏళ్లలోపు బాలురను విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకోవడాన్ని నేరంగా ప్రకటిస్తోంది. దీంతోపాటు 18, 16, 12 ఏళ్లలోపు మైనర్లపై లైంగిక అత్యాచారాలకు బీఎన్ఎస్ వేర్వేరు శిక్షలను నిర్దేశిస్తోంది. ఐపీసీ, పోక్సో చట్టాలు విధించే శిక్షలనే బీఎన్ఎస్లోనూ కొనసాగిస్తున్నప్పటికీ.. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారం కేసులకు సంబంధించి కొత్త క్లాజ్ను చేర్చారు. ఐపీసీ 12 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలను మాత్రమే తీవ్ర నేరంగా పరిగణించేది. అయితే 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలనూ తీవ్రంగా పరిగణించి నేరస్థులకు మరణ శిక్ష కానీ, మరణించేవరకూ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించాలని బీఎన్ఎస్ నిర్దేశిస్తోంది. శృంగారానికి సంబంధించి భార్య వయసు విషయంలోనూ బీఎన్ఎస్ కీలక మార్పు తీసుకొచ్చింది. భార్య వయసు 15 ఏళ్లకు పైన ఉంటే భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఐపీసీ పేర్కొనేది. బీఎన్ఎస్ ఈ విషయంలో భార్య వయసును 15 నుంచి 18 ఏళ్లకు పెంచింది. 18 ఏళ్లలోపు బాలికలను, 16 ఏళ్లలోపు బాలురను అపహరించడం నేరమని ఐపీసీ పేర్కొనగా, 18 ఏళ్లలోపు బాలబాలికల అపహరణలు శిక్షార్హమని బీఎన్ఎస్ నిర్దేశిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారమనుకుని... నేలకేసి బాది
పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. -
పాలకోవాకు వెళ్తే.. ప్రాణాలు పోయాయి!
రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. -
గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు
గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. -
పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
సిమ్కార్డుల దందాలో యూపీ లింకులు..!
దొంగచాటుగా సిమ్కార్డులు విక్రయించడం ద్వారా సైబర్ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. -
చిన్నారిని విక్రయించిన వైద్యులు
బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. -
బాధితుల మౌనమే సైబర్ నేరగాళ్లకు వరం
సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు. -
గుజరాత్ పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం