పాపం.. విలవిల్లాడిన పసికూనలు

స్కూల్‌ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Updated : 03 Jul 2024 05:06 IST

కావలిలో స్కూల్‌ బస్సును ఢీకొన్న లారీ
సహాయకుడి మృతి.. 
16 మంది విద్యార్థులకు గాయాలు

కావలి, న్యూస్‌టుడే: స్కూల్‌ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పట్టణ శివారు ముసునూరు పరిధి టోల్‌ప్లాజా వద్దనున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌ పాఠశాల బస్సు జాతీయ రహదారిని దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. బస్సు బోల్తా పడి డోర్‌ వద్దనున్న పిల్లల సహాయకుడు దేవరాల చిన్నమస్తానయ్య (64)పై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న 24 మంది పిల్లలకుగాను 16 మందికి గాయాలయ్యాయి. బస్సు అద్దాలు ధ్వంసమై గాజు పలకలు గుచ్చుకుని చిన్నారులు రక్తమోడుతున్న గాయాలతో విలవిల్లాడారు. వారిని కావలిలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేశారు. నలుగురిని నెల్లూరుకు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని