- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.
కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. నవీ ముంబయి పోలీసులు ఈ మేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్లో కీలక అంశాలు ప్రస్తావించారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపిన తరహాలోనే కారులోనే సల్మాన్నూ హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్ప్ షూటర్లుగా వాడేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ఏర్పాట్లు చేసింది. ఈ హత్యకు రూ.25 లక్షల సుపారీ కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఈ ప్రణాళికను రూపొందించింది. తుర్కియే నుంచి జిగానా పిస్తోళ్లను తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది. తుర్కియేకు చెందిన ‘టిసాస్’ కంపెనీ ఈ సెమీ-ఆటోమేటిక్ ఆయుధాన్ని తయారుచేస్తోంది. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైనే. భారత్లో వీటిపై నిషేధం ఉంది.
70 మందితో భారీ నెట్వర్క్..
ఈ మొత్తం కుట్ర అమలు కోసం లారెన్స్ బిష్ణోయ్-సంపత్ నెహ్రా గ్యాంగ్లకు చెందిన 60-70 మందితో ఓ భారీ నెట్వర్క్ ఏర్పాటుచేశారు. వీరు సల్మాన్ కదలికలపై నిఘా పెట్టారు. పథకాన్ని అమలు చేసేందుకు 18ఏళ్ల లోపు మైనర్లను సిద్ధం చేసినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఛార్జిషీట్లో ధనుంజయ్ తాప్సింగ్, అజయ్ కశ్యప్, గౌతమ్ వినోద్ భాటియా, వాస్పి మహమ్మద్ ఖాన్ అలియాస్ చైనా, రిజ్వాన్ హసన్ అలియాస్ జావెద్ ఖాన్, దీపక్ హవా సింగ్ పేర్లను ప్రస్తావించింది. మొత్తం 25 మంది వరకు ఈ పథకంలో భాగమైనట్లు వెల్లడించారు. వీరందరినీ అజయ్ కశ్యప్ సమన్వయం చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆర్థిక సమస్యలను తట్టుకోలేక గురువారం నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయతండాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
22 ఏళ్ల తర్వాత పట్టుబడిన సామూహిక అత్యాచార నిందితుడు
సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి 22 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటుచేసుకుంది. -
అనిశా వలలో డీసీఎంఎస్ మేనేజర్
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్ డీసీఎంఎస్(జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు. -
హాథ్రస్ ఘటనలో ఆరుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 121 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
అత్యాచార ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి
ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?