బస్తర్‌ ఫైటర్‌ను హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా నెలంగూర్‌ గ్రామానికి చెందిన సన్ను ఉసెండి(30) అనే బస్తర్‌ ఫైటర్‌ను మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు.

Published : 02 Jul 2024 06:12 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా నెలంగూర్‌ గ్రామానికి చెందిన సన్ను ఉసెండి(30) అనే బస్తర్‌ ఫైటర్‌ను మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమ కదలికలపై ఎక్కువగా అవగాహన ఉండే యువకులను ప్రభుత్వం బస్తర్‌ ఫైటర్స్‌గా నియమించింది. ఉసెండి నారాయణపూర్‌ వెదురు క్రాఫ్ట్‌ కాలనీలో ఆయన బస్తర్‌ ఫైటర్‌గా కొనసాగుతున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామం అయిన నెలంగూర్‌కు వస్తుండగా మార్గమధ్యలో కొందరు మావోయిస్టులు అతడిని కిడ్నాప్‌ చేశారు. సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఆయుధాలతో నరికి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బతుంపర మార్గంలో పడేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని