- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఇంటి పైకప్పు కూలి.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది.
ఒకరికి తీవ్ర గాయాలు
భాస్కర్తో భార్య పద్మ, పిల్లలు తేజస్విని, వసంత, రిత్విక్
నాగర్కర్నూల్, న్యూస్టుడే: మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండు గదుల మట్టి ఇంట్లో భాస్కర్, ఆయన భార్య పద్మ(26), కుమార్తెలు తేజస్విని(7), వసంత(5), కుమారుడు రిత్విక్ (10 నెలలు), భాస్కర్ తల్లిదండ్రులు బాలస్వామి, చిట్టెమ్మ నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి భోజనాలయ్యాక అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంటి ముందు భాగంలో ఉన్న రేకుల వరండాలో భాస్కర్ తల్లిదండ్రులు.. మట్టి కప్పు ఉన్న గదిలో భాస్కర్, పద్మ, ముగ్గురు పిల్లలు పడుకున్నారు. రాత్రి గంటపాటు వర్షం కురవడంతో ఇంటి గోడలు, పైకప్పు తడిశాయి. దూలం చెదలు పట్టి ఉండటంతో.. విరిగిపోయింది. మట్టి పైకప్పు అకస్మాత్తుగా కూలి.. కింద పడుకున్న భాస్కర్ దంపతులు, పిల్లలపై పడింది. ఘటనతో మేలుకున్న భాస్కర్ తల్లిదండ్రులు కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి.. మట్టిని తొలగించి భాస్కర్ను కాపాడారు. మట్టి తొలగించేలోపే పద్మ, ముగ్గురు పిల్లలు అసువులు బాశారు. తీవ్ర గాయాలైన భాస్కర్ను చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
జాగ్రత్తపడేలోపే ప్రమాదం..
తాము ఉంటున్న మట్టి ఇంటిని కూల్చివేసి.. రెండు రేకుల గదులు వేసుకుంటామని స్నేహితులతో భాస్కర్ ఇటీవలే చెప్పారు. 3 రోజుల క్రితమే దూలానికి చెదలు పట్టిన విషయం గుర్తించి.. సపోర్టుగా పెట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టారు. వాటిని ఇంకా అమర్చలేదు. ఇంతలోనే ఘోరం జరిగింది. కర్రలను దూలానికి ఆధారంగా పెట్టి ఉంటే ప్రమాదం తప్పేదని గ్రామస్థులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
భారీగా చౌక బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. -
మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసుల సోదాలు
సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. -
బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే
బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. -
బెయిల్కు 2 నెలల కాలపరిమితి సరికాదు
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్