- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కొత్త చట్టంతో చార్మినార్లో తొలి కేసు
దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు.
నంబరు ప్లేటు లేని వాహదారులపై డిజిటల్ కేసు
ఈనాడు, హైదరాబాద్: దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు. ఆదివారం చార్మినార్ ఠాణా పరిధిలోని గుల్జార్ హౌస్ క్రాస్రోడ్ వద్ద అర్ధరాత్రి దాటాక 1 గంట సమయంలో నంబరు ప్లేటు లేకుండా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఇద్దరిని గుర్తించారు. వీరిని బోరబండకు చెందిన సోహెల్ అన్సారీ(19), ఘాన్సీబజార్కు చెందిన షేక్ సత్వర్(26)లుగా గుర్తించారు. సుమోటోగా 281 బీఎన్ఎస్, సెక్షన్ 80(ఏ), 177 ఎంవీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. కొత్తచట్టాల అమల్లో భాగంగా చార్మినార్ పోలీసులు నమోదుచేసిన కేసుపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
భారీగా చౌక బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. -
మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసుల సోదాలు
సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. -
బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే
బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. -
బెయిల్కు 2 నెలల కాలపరిమితి సరికాదు
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన