- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అనుమానంతో హతమార్చాడు
తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం..
కారుతో ఢీకొట్టి మహిళ దారుణ హత్య
హబ్సిగూడ, న్యూస్టుడే: తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని రామంతపూర్ డివిజన్ వివేక్నగర్లో నివాసం ఉంటున్న మహిళ(47), అదే డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్న చంద్రమౌళి(47) స్థిరాస్తి వ్యాపారులు. ఇద్దరూ కలిసి నాగోల్లో రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆమె కొన్ని నెలలుగా మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని చంద్రమౌళికి అనుమానం వచ్చింది. దీంతో కక్ష పెంచుకున్నాడు. మాట్లాడుకుందామంటూ ఆమెను ఆదివారం అర్ధరాత్రి ఉప్పల్ భగాయత్కు తీసుకొచ్చాడు. అనంతరం ఇళ్లకు తిరిగివెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం చంద్రమౌళి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
భారీగా చౌక బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. -
మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసుల సోదాలు
సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. -
బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే
బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. -
బెయిల్కు 2 నెలల కాలపరిమితి సరికాదు
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు