అనుమానంతో హతమార్చాడు

తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం..

Published : 02 Jul 2024 06:46 IST

కారుతో ఢీకొట్టి మహిళ దారుణ హత్య

హబ్సిగూడ, న్యూస్‌టుడే: తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని రామంతపూర్‌ డివిజన్‌ వివేక్‌నగర్‌లో నివాసం ఉంటున్న మహిళ(47), అదే డివిజన్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్న చంద్రమౌళి(47) స్థిరాస్తి వ్యాపారులు. ఇద్దరూ కలిసి నాగోల్‌లో రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆమె కొన్ని నెలలుగా మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని చంద్రమౌళికి అనుమానం వచ్చింది. దీంతో కక్ష పెంచుకున్నాడు. మాట్లాడుకుందామంటూ ఆమెను ఆదివారం అర్ధరాత్రి ఉప్పల్‌ భగాయత్‌కు తీసుకొచ్చాడు. అనంతరం ఇళ్లకు తిరిగివెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం చంద్రమౌళి ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని