- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మా భూమిని కబ్జా చేశారు..!
తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించారు.
సంతకం పెట్టాలని బెదిరిస్తున్నారు
జనగామ కలెక్టరేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
అపస్మారక స్థితిలో ఉన్న జ్యోతికి సపర్యలు చేస్తున్న కలెక్టరేట్ సిబ్బంది
జనగామ అర్బన్, న్యూస్టుడే: తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించారు. బాధితురాలు దేవులపల్లి జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. నర్మెట్ట మండలకేంద్రానికి చెందిన దేవులపల్లి లక్ష్మయ్యకు సర్వే నం.201/జీ/1లో 1.04 ఎకరాల భూమి ఉంది. ఆయన కుమారుడు (బాధితురాలి తండ్రి) శ్రీహరి మద్యానికి బానిస కావడంతో ఆ భూమిని అతని పేరిట కాకుండా మనుమరాళ్లు జ్యోతి, స్వప్నలకు చెరో 22 గుంటల చొప్పున 1995లో పట్టా చేశారు. ఇప్పుడా భూమిలో అదే మండల కేంద్రానికి చెందిన ఓ పార్టీ నాయకుడితో పాటు మరొకరు కబ్జాకు పాల్పడ్డారు. శ్రీహరి 2020లో తమకు విక్రయించారంటూ.. పట్టా చేయించేందుకు సంతకాలకు వచ్చామని వారు తెలపడంతో, దానికి ఆమె ససేమిరా అన్నారు. దీంతో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తమకు తెలుసునని బెదిరించారని, ఈ విషయమై పోలీసులకు తెలిపినా తమకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఇంటివద్దే గడువుతీరిన మాత్రలు మింగి, తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్లో ప్రజావాణి ప్రారంభమయ్యే సమయంలో పెట్రోలుతో వచ్చి ఆత్మహత్యకు యత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు సీసాను లాక్కున్నారు. అయితే గడువు తీరిన మాత్రలు మింగడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆమెను హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందిస్తూ.. ఈ సమస్య స్థానిక సివిల్ కోర్టులో ఉందని, రెవెన్యూ శాఖ పరిధిలో లేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
భారీగా చౌక బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. -
మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసుల సోదాలు
సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. -
బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే
బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. -
బెయిల్కు 2 నెలల కాలపరిమితి సరికాదు
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ