మోసం చేశాడని ప్రియుడి మర్మాంగం కోసిన వైద్యురాలు

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ వైద్యురాలు. ఈ ఘటన బిహార్‌లోని సారణ్‌ జిల్లా మధురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Published : 02 Jul 2024 05:58 IST

ఈటీవీ భారత్‌: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ వైద్యురాలు. ఈ ఘటన బిహార్‌లోని సారణ్‌ జిల్లా మధురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. హాజీపుర్‌కు చెందిన నిందితురాలు(25), స్థానిక వార్డు కౌన్సిలర్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని నిందితురాలు తరచూ ఒత్తిడి తెచ్చేది. ఈ క్రమంలో సోమవారం వీరిద్దరి మధ్య రిజిస్టర్‌ పెళ్లి గురించి చర్చ నడిచింది. ఈ వివాహానికి బాధితుడు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన వైద్యురాలు అతడి మర్మాంగం కోసేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మహిళా డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని