రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్య

రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్‌ అక్బర్‌ కథనం ప్రకారం..

Published : 02 Jul 2024 05:57 IST

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్‌ అక్బర్‌ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్‌ ఆస్పత్రిలో వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మందిపల్‌కు చెందిన కె.శివానంద్‌(50) కారు డ్రైవరుగా, ఆయన కుమార్తె చందన(20) ల్యాబ్‌ టెక్నీషియన్‌ పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఏనుగొండలోని శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి శ్రీరాం కాలనీ సమీపంలోని రైలు పట్టాలపై శివానంద్, చందన గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి సమాచారం రావటంతో రైల్వే పోలీసులు సుమారు 12 గంటల ప్రాంతంలో మృతదేహాలను జనరల్‌ ఆస్పత్రి శవాగారానికి తరలించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని