ఎస్పీ కార్యాలయంలోనే భార్యను పొడిచి చంపిన కానిస్టేబుల్‌

తనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్యను కానిస్టేబుల్‌ అయిన ఆమె భర్త అక్కడికక్కడే హత్య చేశాడు.

Published : 02 Jul 2024 05:06 IST

హాసన, న్యూస్‌టుడే: తనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్యను కానిస్టేబుల్‌ అయిన ఆమె భర్త అక్కడికక్కడే హత్య చేశాడు. కర్ణాటకలోని హాసన నగర పోలీసు ఠాణాలో పని చేస్తున్న తన భర్త లోక్‌నాథ్‌ నిత్యం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు ఆయన భార్య మమత సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఫిర్యాదు చేయొద్దంటూ అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించినా వినకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని